నాగబాబు ‘జబర్దస్త్’ షో నుండి వెళ్ళిపోయిన తరువాత ఈ షోకు సంబంధించి కర్త కర్మ అన్నీ తానై వ్యవహరిస్తోంది రోజా. వాస్తవానికి అలీ రోజా పక్కన ఉన్నప్పటికీ ఈషో లో స్కిట్స్ ప్రజంట్ చేస్తున్న వారితో రోజా తన సహజసిద్ధమైన శైలిలో ఒక ఆట ఆడుకుంటోంది. ఇలాంటి పరిస్థితులలో హైపర్ ఆది రోజాను టార్గెట్ చేస్తూ వేసిన ఒక సెటైర్ కు సంబంధించిన ప్రోమోను  ‘జబర్దస్త్’ టీమ్ బుల్లితెర పై చూపిస్తూ మరింత రేటింగ్స్ పెంచడానికి కొత్త ప్రయత్నాలు చేస్తున్నారు. 

జబర్దస్త్ కామెడీ షోలో హైపర్ ఆది స్కిట్ అంటే బుల్లితెర ప్రేక్షకులు విపరీతంగా నవ్వుకుంటారు. అసలు ఒక్కోసారి కాన్సెప్ట్ లేకుండానే కేవలం తన పంచ్ లతో ఆ స్కిట్ ను రక్తి కట్టించడంలో ‘జబర్దస్త్’ అలీ సిద్ధహస్తుడు. ‘జబర్దస్త్’ కార్యక్రమం కాకుండా రోజా ‘బతుకు జట్కా బండి’ అనే మరో కార్యక్రమాన్ని కూడ ఆమె హోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. 

అయితే ఆ కార్యక్రమాన్ని టార్గెట్ చేస్తూ హైపర్ ఆది సెటైర్ వేయడంతో ఒక్క క్షణం పాటు రోజా కూడ షాక్ అయింది. వచ్చే వారం ప్రసారం కాబోతున్న ఈ ప్రోమోలో లేడీ కమెడియన్ గీతా సింగ్‌ను తీసుకొచ్చాడు ఆది. ఆమెను పెళ్లి చేసుకున్నట్లుగా స్కిట్ చేసాడు. ‘పదండి రోజా గారి దగ్గరికి వెళ్దామని గీతా అడిగిన వెంటనే ఇప్పుడే కదా పెళ్లైంది అప్పుడే ఆవిడ దగ్గరికి ఎందుకు దానికింకా టైమ్ ఉంది’ అంటూ ఆది పంచ్ వేయగానే అప్పుడుదాకా నవ్వుతున్న రోజా మొఖంలో ఒక్కసారిగా చిన్న షాక్ స్పష్టంగా కనిపించింది. 

రోజా హోస్ట్ చేసే ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమంలోకి వెళ్ళాలి అంటే భార్య భర్తల మధ్య గొడవలు జరగాలిసిందే అనే అర్ధం ‘జబర్దస్త్’ హైపర్ ఆది పంచ్ లో కనిపిస్తోంది. వాస్తవానికి రోజా అసెంబ్లీలో మాట్లాడుతూ ఉంటే ఆమెను టార్గెట్ చేయడానికి ప్రతిపక్ష పార్టీ సభ్యులే భయపడిపోతారు. అలాంటిది హైపర్ ఆది ధైర్యంగా రోజాను టార్గెట్ చేయడం ఇప్పుడు బుల్లితెర ప్రక్షకులకు విపరీతమైన ఆసక్తిని క్రియేట్ చేస్తోంది..  

మరింత సమాచారం తెలుసుకోండి: