మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ మళ్లీ తన జోరు పెంచుతున్నాడు. వరుసగా హిట్లు ఇచ్చిన ఈ మెగా హీరో వరుసగా ఆరు ఫ్లాపులు ఇచ్చి కెరీర్ తొలినాళ్లలోనే ఎదురుదెబ్బలు తిన్నాడు. ఎవరు చెప్పారో ఏమో కానీ తన పేరును సాయి ధరమ్ తేజ్ నుంచి సాయి తేజ్ గా మార్చుకున్నాడు. అలా మార్చుకున్న తర్వాత చేసిన సినిమా చిత్రలహరి తన ఫ్లాప్స్ కు ఫుల్ స్టాప్ పెట్టింది. ఇప్పుడు చేసిన ప్రతి రోజూ పండగే సినిమా ఇయర్ ఎండింగ్ లో సూపర్ హిట్ గా నిలిచి ఈ ఏడాదికి మంచి ముగింపునిచ్చింది.

 

 

ప్రస్తుతం సాయి తేజ్ ఈ సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. బాలకృష్ణ రూలర్ తో పోటీలో నిలిచిన ఈ యంగ్ హీరో కెరీర్ బెస్ట్ హిట్ సాధించాడు. దాదాపు ప్రతి ఏరియాలో సినిమా రెవెన్యూ పరంగా ఫ్రాపిట్ జోన్ లోకి వెళ్లబోతోంది. వచ్చే ఏడాది పదో తేదీ వరకూ పెద్ద సినిమాలు ఏవీ విడుదలకు లేవు. దీంతో ఈ సినిమా మంచి లాంగ్ రన్ దక్కింది. సినిమా సూపర్ హిట్ కావడంతో సక్సెస్ రేట్ కూడా భారీగా పెరుగనుంది. తెలుగు రాష్ట్రాల్లోనే పరిస్థితి ఇలా ఉందనుకుంటే ఓవర్సీస్ లో కూడా సినిమా మంచి రెవెన్యూ సాధిస్తోంది. మంచి టాక్ తో హాఫ్ మిలియన్ మార్క్ కు చేరువగా దూసుకుపోతోంది. దీంతో అక్కడ లాభాల బాట పట్టనుంది.

 

 

సక్సెస్ టాక్ వచ్చిన పెద్ద హీరోల సినిమాలు కూడా ఈ ఏడాది ఓవర్సీస్ లో మంచి రెవెన్యూ రాలేదు. కానీ సాయి తేజ్ మాత్రం లాభాలు తెచ్చిపెడుతూండడం నిజంగా గ్రేట్. గీతా ఆర్ట్స్, యూవీ  సంస్థ భాగస్వామ్యంలో మారుతి ఈ సినిమాను తెరకెక్కించి తాను కూడా హిట్ అందుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: