దాదాపు ఏడు సంవత్సరాల పాటు జబర్దస్త్ షోకు జడ్జిగా వ్యవహరించిన నాగబాబు కొన్ని రోజుల క్రితం జబర్దస్త్ షో నుండి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం నాగబాబు జీ తెలుగు ఛానెల్ లో అదిరింది షోకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు. నాగబాబు జబర్దస్త్ నుండి బయటకు రావడంతో జబర్దస్త్ షో నుండి కొంతమంది టీం లీడర్స్ కూడా బయటకు వచ్చేశారు. నాగబాబు బయటకు వచ్చేసినా జబర్దస్త్ షో రేటింగ్స్ ఏ మాత్రం తగ్గలేదు. 
 
మరోవైపు నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్న అదిరింది షో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. నాగబాబు బయటకు వచ్చేయడంతో నాగబాబు స్థాయి వ్యక్తిని భర్తీ చేయటం మల్లెమల యూనిట్ కు సమస్యగా మారింది. ప్రతి వారం నాగబాబు స్థానాన్ని భర్తీ చేయటానికి మల్లెమాల యూనిట్ కష్టపడుతోంది. కొందరు సీనియర్ నటులు జబర్దస్త్ కు రావాలని ఆశిస్తున్నా జబర్దస్త్ యూనిట్ షరతులు చూసి వెనక్కు తగ్గుతున్నారని సమాచారం. 
 
ఇంతకాలం జబర్దస్త్ షో జడ్జిల విషయంలో కొంత గందరగోళం నెలకొన్నా ఇప్పుడు జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ షోలకు జడ్జిలు ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తరుణ్ భాస్కర్ జబర్దస్త్ షోకు పోసాని కృష్ణ మురళి ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకు ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. వరుసగా రెండు ఎపిసోడ్లకు తరుణ్ భాస్కర్ జడ్జిగా రాగా ఎక్స్ ట్రా కు పోసాని కృష్ణ మురళి వస్తున్నారు. 
 
పోసాని కృష్ణమురళి జడ్జి పాత్రలో బాగానే మెప్పిస్తున్నారు. తరుణ్ భాస్కర్ జడ్జిగా సరిపోయాడా...? లేదా...? తెలియాలంటే మరికొన్ని ఎపిసోడ్ల వరకు ఆగాల్సిందే. జబర్దస్త్ అభిమానుల నుండి మాత్రం నాగబాబు స్థానాన్ని ఎవరితో భర్తీ చేసినా నాగబాబు స్థాయిలో ఆకట్టుకోవటం కష్టమే అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. జబర్దస్త్ నిర్వాహకులు తరుణ్ భాస్కర్, పోసానినే జడ్జిలుగా కొనసాగిస్తారా...? లేదా...? అనే విషయం కూడా తెలియాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: