సరికొత్తగా జబర్దస్త్‌ నటుడు సుధీర్‌ హీరోగా తెరకెక్కిన చిత్రం సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌.  సుధీర్‌ సరసన ఈ చిత్రంలో హీరోయిన్‌గా ధన్య బాలకృష్ణ నటించారు. సాఫ్‌వేర్‌ సుధీర్‌ చిత్రం  ఈ శనివారం విడుదలైనది ఈ చిత్రానికి  అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా వుంది . తాజాగా  టీవీ లైవ్‌ షోలో సుధీర్‌, ధన్య పాల్గొన్నారు.  పలువురు జబర్దస్త్‌ సెలబ్రిటీలు ఈ సందర్భంగా వారికి కాల్‌ చేసి ఈ చిత్రంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. 


లైవ్‌లో సుధీర్‌ కి సర్‌ప్రైజ్‌ కాల్‌ చేసిన రష్మీ.. మొదట ధన్య, సుధీర్‌లకు కంగ్రాట్స్‌ చెప్పారు. సుధీర్ ట్యాలెంట్‌ అనేది వృథా కాదనే దానికి  నిదర్శనమని అన్నారు. టీవీ నుంచి బిగ్‌​ స్కీ ట్యాలెంట్‌ పరిచమవ్వడం మంచి పరిణామని అన్నారు. ప్రస్తుతం హాలిడే వెకేషన్‌లో ఉన్నానని.. త్వరలోనే సినిమా చూస్తానని రష్మీ చెప్పారు. 

 

సుధీర్‌ నవరసాలు పండించడంలో దిట్ట అని చెప్పిన రష్మీ.. త్వరలోనే సుధీర్‌లోని అన్ని కోణాలు చూస్తారు. ఈ సందర్భంగా సుధీర్‌, రష్మి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడూ వస్తుందని ప్రశ్నించగా.. ‘కొన్ని చర్చలు జరుగుతున్నాయి..   ఈ సినిమాతో సుధీర్‌ ప్రస్తుతం బీజీగా ఉన్నాడు. పరిస్థితులు ఎలా ఉంటాయో.. ఎంత త్వరగా ఇది జరుగుతుందో చూద్దాం’ అని రష్మీ తెలిపారు.

 

అలాగే లైవ్‌ షోకు రామ్‌ప్రసాద్‌ ఫోన్‌ చేసారు  .. లైవ్ లోనే సుధీర్‌ను ఆటపట్టించాడు. ఆటో పంచ్‌లు తనదైన శైలిలో  విసిరాడు.  ఇంత మంచి రెస్పాన్స్‌ సాఫ్ట్‌వేర్‌ సుధీర్‌ చిత్రానికి వస్తుందని ఊహించలేదని సుధీర్‌ చెప్పారు. సినిమా బాగుందని  చాలా మంది ఫోన్‌లు చేసి చెబుతున్నారని తెలిపారు. ఒకవేళ ఈ సినిమా ఎవరికైనా  నచ్చకపోతే క్షమించాలన్న సుధీర్‌.. మరో మంచి సినిమాతో ముందుకు వస్తానని అన్నారు.  ఈ సినిమాకు అనుకున్న దానికన్నా పెద్ద హిట్‌ అయిందన్న ధన్య.. ప్రతి ఒక్కరు ఈ సినిమాను థియేటర్‌లోనే చూడాలని, పైరసీకి దూరంగా ఉండాలని కోరారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: