గత కొంత కాలంగా  మ్యాచో హీరో  గోపిచంద్ కు అస్సలు  కలిసి రావడం లేదు.  లౌఖ్యం తరువాత  అరడజను కు పైగా  సినిమాల్లో నటించిన  గోపి  అందులో ఏ  ఒక్క సినిమా తో  హిట్టు కొట్టలేకపోయాడు. ఇక ఈ ఏడాది  చాణక్య అంటూ వచ్చినా  అది కూడా  మరో  చేదు జ్ఞాపకాన్నే మిగిల్చింది.  ఈసినిమా పుణ్యమాని సీనియర్ ప్రొడ్యూసర్  బీవీఎస్ఎన్ ప్రసాద్  నిర్మాణంలో చేయాల్సిన  సినిమా ఆగిపోయింది.  ఇటీవలే  ఆ సినిమా పూజా కార్యక్రమాలతో లాంచ్ అయ్యింది. అయితే ఏమైందో ఏమో  సినిమా సెట్స్ మీదకు వెళ్లకముందే  ఆగిపోయింది.  నూతన దర్శకుడు  బిను సుబ్రమణ్యం ఆ చిత్రాన్ని డైరెక్ట్ చేయాల్సి  వుంది. 
 
ఇక  గోపిచంద్ చేతిలో ప్రస్తుతం ఒకే ఒక్క సినిమా వుంది.  ఈసినిమా  మీదనే అతని  భవిష్యత్తు  ఆధారపడి వుంది. గోపి ప్రస్తుతం  మినిమం గ్యారెంటీ  డైరెక్టర్  సంపత్ నంది  డైరెక్షన్ లో తన 28వ చిత్రంలో నటిస్తున్నాడు. ఇటివలే  ఈ సినిమా షూటింగ్  స్టార్ట్ కాగా  ఈ రోజు తో   మొదటి షెడ్యూల్  కంప్లీట్ అయ్యింది.  15రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ లో  కబడ్డీ నేపథ్యంలో వచ్చే కొన్నికీలక సన్నివేశాలను  చిత్రీకరించారు.  ఈచిత్రంతో ఫస్ట్ టైం  గోపిచంద్ తన కెరీర్ లో స్పోర్ట్స్  డ్రామా లో నటిస్తున్నాడు. ఇందులో  బాయ్స్  కబడ్డీ టీం కు కోచ్ గా గోపిచంద్ కనిపించనుండగా గర్ల్స్ కబడ్డీ టీం కు కోచ్ గా మిల్కీ బ్యూటీ  తమన్నా  నటిస్తుందని  సమాచారం.   యూ టర్న్ నిర్మాత శ్రీనివాస్ చిట్టూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  ఇక గోపిచంద్ , సంపత్ నంది  కాంబినేషన్ లో ఇది రెండో సినిమా. ఇంతకుముందు  వీరి  కాంబినేషన్ లో  గౌతమ్ నంద  తెరకెక్కగా ఆ సినిమా  ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరి ఈ సారైనా వీరిద్దరూ  హిట్ కొడతారో చూడాలి.  
  

మరింత సమాచారం తెలుసుకోండి: