అగ్ర దర్శకుడు  ఎస్ ఎస్ రాజమౌళి  దర్శకత్వంలో  టాలీవుడ్ బిగెస్ట్ మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'. యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న  చిత్రం కావడం అలాగే  బాహుబలి తరువాత రాజమౌళి  డైరెక్ట్ చేస్తున్న కావడంతో  ఆర్ఆర్ఆర్ పై దేశ వ్యాప్తంగా  భారీ అంచనాలు  వున్నాయి. అందుకు తగ్గట్లే ఈ చిత్రం  ప్రీ రిలీజ్ బిజినెస్ లో అదరగొడుతుంది. ఒక్క  పశ్చిమ గోదావరి జిల్లాకు గాను ఈ చిత్రం 13కోట్ల బిజినెస్ చేసిందని సమాచారం. ఇక  ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ అవ్వగా  కొద్దీ రోజుల క్రితం  అరకు లో కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. 
 
ఈ చిత్రం యొక్క తదుపరి షెడ్యూల్ వచ్చే ఏడాది జనవరి 4నుండి పాడేరు లో జరుగనుంది. ఈ షెడ్యూల్ లో ఎన్టీఆర్ , చరణ్ లు పాల్గొననున్నారు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుమారు 300 కోట్ల భారీ  బడ్జెట్ తో  తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా బాలీవుడ్  హీరోయిన్  అలియా భట్ నటిస్తుండగా  ఎన్టీఆర్ కు జోడిగా  హాలీవుడ్ నటి ఒలివియా మోరిస్ కనిపించనుంది.  స్వాతంత్య్ర సమర యోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత  చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు.  
 
వీరితో పాటు  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ ,తమిళ నటుడు  సముద్రఖని కీలక పాత్రల్లో నటిస్తున్నారు.  దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తుండగా  ప్రముఖ రచయిత  బుర్రా సాయి మాధవ్  డైలాగ్స్  అందిస్తున్నాడు. వచ్చే ఏడాది జులై 30 న ఈ చిత్రం  తెలుగు తో పాటు తమిళ, కన్నడ , మలయాళ , హిందీ భాషల్లో విడుదలకానుంది.  

మరింత సమాచారం తెలుసుకోండి: