మరొక రెండు రోజులలో కొత్త సంవత్సరం రాబోతున్న నేపధ్యంలో ఈ కొత్త సంవత్సరం ప్రారంభం అయిన వెంటనే ఒకే వారంలో జరగబోతున్న’సరిలేరు నీకెవ్వరు’ ‘అల వైకుంఠపురములో’ మూవీలకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఏర్పాట్లు కూడ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. మహేష్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జనవరి 5న జరగబోతు ఉంటే ఆ మరునాడే జనవరి 6న అల్లు అర్జున్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతోంది.

దీనితో ఈ రెండు సినిమాల రిలీజ్ కు కేవలం ఒకరోజు గ్యాప్ ఉన్నట్లుగానే ఈ రెండు సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్స్ కు కూడ కేవలం ఒకరోజు గ్యాప్ ఉండటం యాధృశ్చికం. ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్ కు చిరంజీవి ముఖ్య అతిధిగా రాబోతున్న నేపధ్యంలో ‘అల వైకుంఠపురములో’ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ లేదంటే పవన్ కళ్యాణ్ అతిధులుగా వస్తారు అంటూ ప్రచారం జరిగింది. 

అయితే ఈ విషయమై త్రివిక్రమ్ రంగంలోకి దిగి అతిధిగా ఎవర్ని పిలవాలి అంటూ అల్లు అర్జున్ అభిప్రాయం అడిగినప్పుడు త్రివిక్రమ్ కు బన్నీ నుండి ఊహించని సమాధానం వచ్చినట్లుగా వార్తలు వస్తున్నాయి. తన మూవీ ఫంక్షన్ కు పవన్ ను కానీ జూనియర్ ను కాని అతిధులుగా పిలవవద్దు అనీ ఈసినిమా కోసం పనిచేసిన యూనిట్ సభ్యులు అందర్ని అతిధులుగా గౌరవించుకుందామని ‘అల వైకుంఠపురములో’ మూవీకి ఏ టాప్ హీరో ప్రమోషన్ అవసరం లేదనీ తన అభిమానులు ప్రేక్షకులు అభిమానం చాలు అంటూ త్రివిక్రమ్ సూచనను సున్నితంగా బన్నీ తిరస్కరించినట్లు వార్తలు వస్తున్నాయి.  

దీనితో మహేష్ మూవీ ఫంక్షన్ కు చిరంజీవి అతిధిగా వెళ్ళుతున్నందుకు నొచ్చుకున్న బన్నీ ఇలా తన మూవీ ఫంక్షన్ కు అతిధులుగా ఎవరు అక్కరలేదు అని భావిస్తున్నాడా ? లేదంటే పవన్ కళ్యాణ్ జూనియర్ లాంటి టాప్ హీరోలు తన సినిమా ఫంక్షన్ కు వస్తే మీడియా దృష్టి అంతా తన పై కాకుండా పవన్ జూనియర్ లపై డైవర్ట్ అవుతుందా అన్న ఆలోచనలతో బన్నీ ఇలాంటి నిర్ణయం తీసుకుని ఉంటాడు అని  కొందరు అంటున్నారు. ఏది ఏమైనప్పటికీ బన్నీ తీసుకున్న సాహసపూరితమైన నిర్ణయం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది.. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: