హిందీలో
అజయ్ దేవగణ్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ గా నటించిన రైడ్ చిత్రం గత ఏడాది విడుదలై సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈచిత్రాన్ని
కింగ్,
నాగార్జున తెలుగులో
రీమేక్ చేయాలనుకుంటున్నాడు. ఇటీవలే ఈ వార్త బయటికి రాగ ఇప్పటివరకు మాత్రం అధికారికంగా ఎలాంటి ప్రకటన వెలుబడలేదు. ఇక ఈ చిత్రానికి దర్శకుడు దొరికాడని టాక్ వినిపిస్తుంది. పీఎస్వి గరుడ వేగ తో సూపర్ హిట్ కొట్టిన యంగ్ డైరెక్టర్
ప్రవీణ్ సత్తార్ రైడ్
రీమేక్ ను తెరకెక్కించనున్నాడట. త్వరలోనే ఈ విషయం పై క్లారిటీ రానుంది.
ఇక గత కొంత కాలంగా వరుస పరాజయాలతో సతమతవుతున్నాడు నాగార్జున. దాంతో కమర్షియల్ సినిమాలను పక్కకు పెట్టి ప్రయోగాత్మక చిత్రాలు చేయాలని భావిస్తున్నాడు. అందులో భాగంగానే రైడ్ రీమేక్ అయితే తనకు కరెక్ట్ గా సెట్ అవుతుందని ఆసినిమా పై మనసు పారేసుకున్నాడట. ఇదిలా ఉంటే ఈఏడాది మన్మథుడు 2 తో ఖంగుతిన్న నాగ్ .. ఈ చిత్రం తరువాత కొంత గ్యాప్ తీసుకుని ప్రస్తుతం సాల్మన్ డైరెక్షన్ లో వైల్డ్ డాగ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. ఎటువంటి హడావిడి లేకుండా సైలెంట్ గా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం లో సాంగ్స్ ,హీరోయిన్ కు తావులేదు. ఇది కూడా ప్రయోగాత్మకంగా తెరకెక్కుతుంది. ఈ చిత్రంలో నాగార్జున , విజయ్ వర్మ అనే ఎన్ ఐ ఏ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నాడు. 2009 లో జరిగిన ఓ ఎన్కౌంటర్ ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు. మ్యాట్నీ ఎంటర్ టైన్మెంట్స్ పతాకం పై నిరంజన్ రెడ్డి , అన్వేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ లో ఈ చిత్రం విడుదలకానుంది.