అల్లు అర్జున్ పైకి చాల సరదాగా కనపడుతూ జోక్స్ వేస్తూ కనిపించినా ఒకసారి వర్క్ లోకి దిగారు అంటే పని పై విపరీతమైన శ్రద్ధ పడతాడు. అందువల్లనే ఎంతమంది క్రేజీ యంగ్ హీరోలు వచ్చినా బన్నీ క్రేజ్ తగ్గడం లేదు. ఒక సినిమా గురించి బన్నీ తీసుకునే జాగ్రత్తలు తపన ఎలాంటి రేంజ్ లో ఉంటుందో లేటెస్ట్ గా జరిగిన ఒక సంఘటన రుజువు చేస్తోంది. 

‘అల వైకుంఠపురములో’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 6న హైదరాబాద్ లోని పోలీసు గ్రౌండ్స్ లో జరపడానికి భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. దీనితోపాటు ఈమూవీ ప్రమోషన్ కు సంబంధించి అనేక ఛానల్స్ కు పత్రికలకు ఇంటర్వ్యూలు ఇవ్వడానికి బన్నీ సిద్ధం అవుతున్నాడు. ఇలాంటి పరిస్థితులలో ఇంత హడావిడి మధ్య బన్నీ తన భార్య పిల్లలతో మొన్న ఆదివారం రాత్రి థాయిలాండ్ వెళ్ళినట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి బన్నీ తన న్యూఇయర్ వేడుకలను అతడు ఎప్పుడు జరుపుకునే బ్యాంకాక్ లో కాకుండా థాయిలాండ్ లో జరుపు కోవడానికి ఒక కారణం ఉంది. జనవరి నుండి బన్నీ సుకుమార్మూవీ షూటింగ్ థాయిలాండ్ లోని దట్టమైన అటవీ ప్రాంతంలో ప్రారంభం కాబోతోంది. వాస్తవానికి ఈ మూవీ షూటింగ్ ను శేషాచలం అటవీ ప్రాంతంలో తీయాలని భావించారు. అయితే ఇక్కడి అటవీ అధికారుల అనుమతి రాకపోవడంతో ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ చాల భాగం థాయిలాండ్ లోని అటవీ ప్రాంతంలో జరుగుతోంది. 

దీనితో తన మూవీ షూటింగ్ జరగబోయే అటవీ ప్రాంతాన్ని చూసే పనిని తన న్యూఇయర్ సరదాలను తన కుటుంబ సభ్యులతో తీర్చుకునే పనిని కలుపుకుని న్యూఇయర్ సంబరాలలో కూడ బన్నీ తన సినిమాల విషయాల పై దృష్టి పెట్టడం ఇప్పుడు హాట్ న్యూస్ గా మారింది. న్యూఇయర్ వేడుకలు ముగిసిన వెంటనే బన్నీ జనవరి 2న తిరిగి వచ్చి తన ‘అల వైకుంఠపురములో’ సినిమా ప్రమోషన్ లో బిజీ అవ్వబోతున్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: