డ్యాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ప్రస్తుతం తన కొడుకు  ఆకాష్ పూరి  హీరోగా  రొమాంటిక్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.  గత కొన్ని నెలలుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం తుది దశకు చేరుకుంది.  ఇక ఈ చిత్రం  లో మొదటగా  47ఏళ్ళ  హాట్ భామ  మందిరా బేడీ ని  తల్లి పాత్ర కు ఎంపికచేశారు.  గోవా లో జరిగిన షెడ్యూల్ లో  ఆమె పై కొన్ని కీలక సన్నివేశాలను కూడా తెరకెక్కించారు. అయితే మందిరా సీన్స్  తో  పూరి కన్విన్స్ కాలేకపోయాడు. దాంతో  ఆమె ను తొలిగించి  ఆ పాత్రలో  రమ్యకృష్ణ ను తీసుకొచ్చాడు. 
 
ఇటీవలే రమ్యకృష్ణసినిమా షూటింగ్ లో జాయిన్ అయ్యింది. దాంతో మళ్ళీ మొదటి నుండి ఆ  పాత్ర తాలూకు   సన్నివేశాలను రీ షూట్ చేస్తున్నారు.  నూతన దర్శకుడు అనిల్ పడూరి డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో   మకరందేశ్ పాండే కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ కశ్యప్ సంగీతం అందిస్తున్నాడు.  యూత్ ఫుల్ ఎంటర్టైనర్  గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్నివచ్చే ఏడాది సమ్మర్ లో  విడుదలచేయనున్నారు. ఈ చిత్రంలో కేతిక శర్మ  హీరోయిన్ గా నటిస్తుంది. 
 
ఇక   2018లో పూరి జగన్నాథ్ 'మెహబూబా' అనే చిత్రంతో ఆకాష్ పూరిని రీ లాంచ్ చేద్దాం అనుకున్నాడు కానీ   ఈ చిత్రం  డిజాస్టర్  అయ్యింది.  అయితే  ఆకాష్ నటన కు మంచి  మార్కులే పడ్డాయి.  ఇక ఇప్పుడు 'రొమాంటిక్' తో   తన కొడుకును  ఎలాగైనా హీరోగా నిలబెట్టాలని పట్టుదలతో వున్నాడట పూరి.  ఇదిలావుంటే  వరుస పరాజయాలతో సతమతమైన పూరి  ఇటీవల ఇస్మార్ట్ శంకర్ తో బ్లాక్ బాస్టర్ హిట్  కొట్టి  బౌన్స్ బ్యాక్ అయ్యాడు.  ఇక ఈ దర్శకుడు తన తదుపరి చిత్రాన్ని సెన్సేషనల్ హీరో  విజయ్ దేవరకొండ తో చేయనున్నాడు. ఫైటర్ అనే టైటిల్ లో తెరకెక్క నున్న ఈ చిత్రం జనవరి నుండి సెట్స్ మీదకు వెళ్లనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: