ఈ మధ్యకాలంలో ఆడవాళ్లపై అరాచకాలు అత్యాచారాలు కూడా ఎక్కువ అయ్యాయన్న విషయం తెలిసిందే. తెలుగులు రాష్ట్రాలను కుదిపేసిన దిశ ఘటన పూర్తిగా మరువక ముందే వరుసగా ఎన్నో ఘటనలు జరుగుతూ వస్తున్నాయి. కామాంధుల కామ కోరికలకు ఆడవాళ్లు బాలి అవుతూ వస్తున్నా విషయం తెలిసిందే. చిన్న పెద్ద అని కూడా తేడాల లేకుండా మెగా మృగాళ్లు రెచ్చిపోతున్నారు. 

 

ఇది ఇలా ఉండగా తాజాగా ఓ ఘటన చోటుచేసుకుంది. అవ్వ చనిపోయింది రమ్మన్నారు అంటూ తీసుకెళ్లి ఓ ఇద్దరు కామ వాంఛన తీర్చుకున్నారు. వివరాల్లోకి వెళితే.. చిత్తూరు జిల్లా నిమ్మన్న పల్లెలో ఈ ఘటన వెలుగు చూసింది. మీ అవ్వ చనిపోయింది.. త్వరగా తీసుకురావాలని ఇంట్లో వారు చెప్పారు’’ అంటూ కొందరు బైక్‌పై వచ్చి వివాహితకు చెప్పాడు. ఆమె ఏడ్చుకుంటూ వచ్చి బైక్ ఎక్కింది. పక్కా ప్రణాళిక ప్రకారం ఆ దుర్మార్గులు ఆమెను తీసుకెళ్లి బలవంతంగా అత్యాచారానికి ఒడిగట్టారు.

 

 మొన్న ఆదివారం మధ్యాహ్నం గ్రామ సమీపంలోని పొలాల వద్ద పొరక ఊసలు సేకరించేందుకు వెళ్లింది. అయితే రెడ్డివారిపల్లె పంచాయతీ, పిట్టావాండ్లపల్లెవడ్డిపల్లెకు చెందిన ఉప్పుతోళ్ల మహేష్‌ అతడి స్నేహితులు విజయ్, శివ ద్విచక్ర వాహనాల్లో వెళ్లారు. మీ అవ్వ మరణించింది.. ఇంట్లోని నిన్ను తీసుకుని రమ్మన్నారు అంటూ మహేష్ ఆమెకు నమ్మబలికాడు. దీంతో ఆ మహిళ ఏడుస్తూ అతని మోటార్‌ సైకిల్‌ ఎక్కింది.


అలా వెళ్లిన మహిళను ఆ కామాంధులు ఓ కొండా ప్రాంతానికి తీసుకెళ్లి బలవంతం చేసి అత్యాచారం చేశారు. అనంతరం ఆ మహిళను బోయకొండ ఆర్చి వద్ద వదలి పారిపోయారు. దీంతో సోమవారం ఆమె ఇంటికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం తెలిపింది. ఈ విషయమై కుటుంబ సభ్యులు మంగళవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆ మేరకు నిమ్మనపల్లె ఎస్‌ఐ సహదేవి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఇద్దరినీ అదుపులోకి తీసుకొని కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విశారన చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: