ప్రస్తుతం శ్రియకు అవకాశాలు ఇచ్చే వారు లేరు. దీనికితోడు ఆమెకు పెళ్ళి కూడ జరగడంతో ఆమె పై ఎటువంటి క్రేజ్ లేదు. అయినప్పటికీ ఆమె తాను ఇంకా సినిమాలకు సిద్ధం అంటూ సంకేతాలు ఇస్తూ కొన్ని హాట్ ఫోటో షూట్స్ కూడ చేస్తోంది. ఇలాంటి పరిస్థితులలో ఆమెకు వెంకటేష్ తో వచ్చిన అవకాశాన్ని శ్రియ తిరస్కరించడం ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారింది. 

వెంకటేష్ తమిళంలో సూపర్ హిట్ అయిన ‘అసురన్’ మూవీని తెలుగులో రీ మెక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ప్రస్తుతం ఫెయిల్యూర్ దర్శకుడుగా పేరుపడ్డ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా తమిళ ఒరిజినల్ వెర్షన్ లో ధనుష్ పక్కన మళయాళ నటి మంజు వారియర్ నటించింది. 

అయితే ఈ మూవీకి సంబంధించిన తెలుగు రీమేక్ లో మంజు వారియర్ పాత్రను అనుష్క చేత నటింప చేయాలని చాల ప్రయత్నాలు చేసారు. అయితే ఆమె స్పందించక పోవడంతో ఇప్పటికే సీనియర్ హీరోల హీరోయిన్ గా పేరు తెచ్చుకున్న శ్రియను సంప్రదిస్తే ఆమె అడిగిన పారితోషికం ఎక్కువగా అనిపించడంతో ఆమెతో బేరసారాలు జరిగినట్లు టాక్. 

దీనితో విసిగిపోయిన శ్రియ తనకు డేట్స్ సద్దుబాటు అవ్వడం లేదు అంటూ వెంకీ సినిమా ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ పాత్రకు ప్రియమణిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈమెకు కూడ పెళ్లి అయినప్పటికీ తిరిగి మళ్ళీ ఫిలిం హీరోయిన్ గా రీ ఎంట్రీ కోసం ప్రయత్నిస్తున్న పరిస్థితులలో అనుకోకుండా వచ్చిన ఈ అవకాశాన్ని పారితోషికం విషయంలో అంతగా పట్టుపట్టకుండా వెంకీ మామ సమస్యలు తీర్చింది అని అంటున్నారు చాల మంది. దీనితో శ్రియ వెంకీ మామను తిరస్కరించిన విషయమై ఇండస్ట్రీ వర్గాలలో హాట్ హాట్ చర్చలు జరుగుతూ ప్రియమణికి మళ్ళీ టర్నింగ్ పాయింట్ వచ్చింది అని అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: