13 సంవత్సరాల తరువాత తిరిగి తెలుగు సినిమాలలోకి రీ ఎంట్రీ ఇస్తున్న విజయశాంతి భవిష్యత్ ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ తో తేలిపోతుంది. ఆమెకు వీరాభిమాని అయిన అనీల్ రావిపూడి ఆమెకోసం ఈ సినిమాలో ప్రొఫిసర్ భారతి పాత్రను క్రియేట్ చేయడమే కాకుండా ఆమె లుక్స్ స్క్రీన్ పై బాగా కనిపించడానికి ఆమె చర్మం స్క్రీన్ పై మృధువుగా కనిపించడానికి విజువల్ ఎఫెక్ట్స్ కోసం ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో చాల ఖర్చు చేసారు.

ఈసినిమా ఇంకా విడుదల కాకుండానే ఆమెను తమ సినిమాలలో కీలక పాత్రలకు తీసుకుందామని కొందరు దర్శక నిర్మాతలు ఆమెను తమ కథలతో కాలుస్తున్నప్పుడు ఆమె చెపుతున్న కండిషన్స్ విని మైండ్ బ్లాంక్ అవుతున్నట్లు టాక్. తాను ఒక మూవీలో నటించాలి అంటే రెండు కోట్ల పారితోషికానికి తగ్గనని అదేవిధంగా తన పాత్ర హీరో పాత్రతో సమానంగా ఉండాలని కండిషన్స్ పెడుతున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు తాను హీరోల అమ్మ వదిన అక్క పాత్రలలో నటించడానికి అంగీకరించనని తనకు షూటింగ్ సమయంలో కూడ హీరోతో సమానమైన గౌరవం ఉంటేనే తాను నటిస్తాను అని విజయశాంతి కండిషన్స్ పెడుతున్నట్లు టాక్. దీనితో ఆమెకు కథ చెప్పాలని వచ్చిన దర్శకులు మరో మాట మాట్లాడకుండా మళ్ళీ వస్తామని  చెప్పి తిరిగి వెళ్ళి పోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

దీనితో విజయశాంతి చెప్పే కండిషన్స్ నిర్మాతలు ఒప్పుకోవాలి అంటే విజయశాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ రిలీజ్ తరువాత వచ్చే క్రేజ్ ను బట్టి ఆమె భవిష్యత్ ఆధారపడి ఉంటుంది అని అంటున్నారు. వాస్తవానికి గతంలో ఆమె నటించిన సూపర్ హిట్ సినిమాలు అన్నిటికీ హీరోయిన్ సరిత డబ్బింగ్ చెప్పింది. ఆమె వాయస్ విజయశాంతికి బాగా సూట్ అయింది. అయితే ఈసారి ఆమె తన సొంత గొంతుతో తన పాత్రకు డబ్బింగ్ చెప్పుకున్న పరిస్థితులలో ఆమె వాయస్ కు ప్రేక్షకులు ఎలా కనెక్ట్ అవుతారో చూడాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: