గతంలో ఎన్నడూ లేని విధంగా
సంక్రాంతి సినిమా ల రిలీజ్ డేట్ల విషయంలో ఈసారి గందరగోళం నెలకొంది. ఈ
సంక్రాంతి కి నాలుగు సినిమాలు పోటీపడుతున్నాయి. అందులో
రజినీకాంత్ దర్బార్ ,
మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరు,
అల్లు అర్జున్ అల... వైకుంఠపురములో,
కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా బరిలో నిలిచాయి. వీటిలో దర్బార్ ఈనెల 9న రానుండగా ,
ఎంత మంచివాడవురా ఈనెల 15న వస్తుంది. ఈ సినిమాల రిలీజ్ డేట్ల విషయంలో ఎలాంటి సందిగ్థత లేదు కానీ అసలు చిక్కంతా అల, సరిలేరు సినిమాలతోనే వచ్చింది. ముందుగా ఈ చిత్రాలను
జనవరి 12న విడుదలచేస్తామని ప్రకటించుకున్నారు. అయితే రెండు సినిమాలు ఓకే రోజు విడుదలైతే కలెక్షన్స్ కు దెబ్బ పడడం ఖాయం దాంతో
దిల్ రాజు జోక్యంతో సరిలేరు ను 11న అల ను 12న విడుదలచేసేలా సర్దుబాటు చేసుకున్నారు.
అయితే కొద్దీ రోజుల క్రితం అల.. వైకుంఠపురములో మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలో మనసు మార్చుకోవడంతో మళ్ళీ కథ మొదటి కొచ్చింది. ఓపెనింగ్స్ కోసం సినిమా ను ఒక రోజు ముందుగా థియేటర్లలోకి తీసుకరావాలని ప్లాన్ చేస్తున్నారు. దాంతో సరిలేరు టీం కూడా రిలీజ్ డేట్ విషయంలో పునరాలోచనలో పడింది. అల టీం రిలీజ్ డేట్ ప్రకటించాకే రిలీజ్ డేట్ ను కంఫర్మ్ చేయాలని పట్టు బట్టుకొని కూర్చుంది. దాంతో తాజాగా ఈ రెండు సినిమాలు సెన్సార్ పూర్తి చేసుకున్న కూడా రిలీజ్ డేట్లు ప్రకటించలేదు. సంక్రాంతికి వస్తున్నాం కానీ ఎప్పుడు వస్తున్నారో ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. అయితే ఫిలిం నగర్ వర్గాల నుండి వస్తున్న సమాచారం ప్రకారం ఈరెండు సినిమాలు ఈనెల 11న విడుదలకానున్నాయని తెలుస్తుంది. ఈసాయంత్రం లోగా ఈ రిలీజ్ డేట్ల విషయంలో ఫుల్ క్లారిటీ వచ్చే అవకాశాలు వున్నాయి.