ఈరోజు సాయంత్రం జరగబోతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు మరింత క్రేజ్ తీసుకు రావడానికి ఈ మూవీలో తమన్నా చేసిన స్పెషల్ సాంగ్ ను ఆమె ఈరోజు ఈ సినిమా విడుదల కాకుండానే లైవ్ లో డాన్స్ చేయబోతోంది. దీనితో రాబోతున్న శనివారం విడుదల కాబోతున్న ఈ మూవీలోని తమన్నా సాంగ్ ను లక్షలాది మంది జనం తమ టివి సెట్స్ లో ముందుగానే చూడబోతున్నారు.

అయితే ఈ పాటలో సినిమాలో మాదిరిగా మహేష్ బాబు కాలు కదిపి డ్యాన్స్ చేస్తాడా ? చేయడా? అన్న విషయం పై క్లారిటీ లేదు. ఇక దేవిశ్రీ ప్రసాద్ కూడ ఈరోజు జరగబోయే ఈవెంట్ లో లైవ్ పెర్ ఫార్మాన్స్ ఇవ్వబోతున్నాడు. 

ఈ సినిమాలోని పాటలకు ఆయన స్టెప్స్ వేస్తూ ఈ ఈవెంట్ కు జోష్ ను తీసుకు రావడమే కాకుండా ఈ సినిమాలో పాటలను ఆ పాటలు పాడిన గాయకులే వేదిక మీద పాడిస్తూ సంగీత విభావరి కూడ జరగబోతోంది. మెగా స్టార్ చిరంజీవితో పాటు సూపర్ స్టార్ కృష్ణ ఇండస్ట్రీకి సంబంధించిన అనేకమంది ప్రముఖులు ఈ ఈవెంట్ లో సందడి చేయబోతున్నారు. 

వాస్తవానికి ఈ ఈవెంట్ కు ఎంతమంది అతిధులు వచ్చినా మీడియా కెమెరాల దృష్టి మాత్రం విజయశాంతి పైనే ఉంటుంది. గతంలో రాజకీయంగా అనేక సార్లు చిరంజీవిని టార్గెట్ చేసిన విజయశాంతి ఇప్పుడు జరిగిన విషయాలన్నీ మరిచిపోయి స్టేజ్ పై ఆమె చిరంజీవితో సాన్నిహిత్యాన్ని నటిస్తూ చేసే నటన కూడ ఈనాటి కార్యక్రమానికి మరొక హైలెట్. ఇది ఇలా ఉండగా ఈరోజు ఎల్ బి స్టేడియంలో జరగబోతున్న ఈ కార్యక్రమానికి సంబంధించి కట్టుదిట్టమైన బద్రతా ఏర్పాట్లు చేయడమే కాకుండా ఈ కార్యక్రమానికి వేల సంఖ్యలో పాస్ లు పంచడంలో ఈ ఈవెంట్ కు కనీసం 40 వేలమంది వచ్చే అవకాసం ఉంది అన్న వార్తలు వినిపిస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: