సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన లేటెస్ట్ మూవీ సరిలేరునీకెవ్వరు రిలీజ్ డేట్ విషయం లో నిన్ననే ఫుల్ క్లారిటీ వచ్చింది. ముందుగా అనుకున్నట్లే జనవరి 11 నే ఈచిత్రం విడుదలకానుంది. ఇక ఈరోజు హైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియం లో ఈచిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది. ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథి గా వస్తుండడంతో ఈ ఈవెంట్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే చిరు , మహేష్ మొదటి సారి ఓకే వేదిక పై కనిపించనుండడం తో అటు మహేష్ ఫ్యాన్స్ తోపాటు మెగా అభిమానులు కూడా ఈ ఈవెంట్ కు భారీ గా తరలిరానున్నారు.
ఇక ఈ ఈవెంట్ లో సరిలేరు నీకెవ్వరు ట్రైలర్ ను రాత్రి 9:09 గంటలకు విడుదలచేయనున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్ రికార్డు స్థాయిలో వ్యూస్ ను రాబట్టగా మరి ఈ ట్రైలర్ ఎన్ని రికార్డులు సృష్టిస్తుందో చూడాలి. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ చిత్రంలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించింది. కాగా చాలా కాలం తరువాత ఆమె తెర మీద కనిపించనుండడంతో ఈ చిత్రం పై అంచనాలు మరింతగా పెరిగిపోయాయి.
యాక్షన్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈ చిత్రంలో రష్మిక మందన్న
హీరోయిన్ గా నటించగా రాక్ స్టార్ దేవి శ్రీ
ప్రసాద్ సంగీతం అందించాడు. ఏకే ఎంటర్ టైమెంట్స్ ,
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ , జి ఏం బి ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మించిన ఈచిత్రంలో మిల్కీ
బ్యూటీ తమన్నా స్పెషల్ సాంగ్ లో కనిపించనుంది. ఇక ఈ సంక్రాంతికి అల్లు
అర్జున్ నటిస్తున్న అల.. వైకుంఠపురములో కూడా విడుదలకానుండడంతో సరిలేరు నీకెవ్వరు కు బాక్సాఫీస్ వద్ద గట్టిపోటి ఎదురుకానుంది.