నిన్న జరిగిన ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సూపర్ స్టార్ కృష్ణ రాలేదు. సాధారణంగా తనకు అంతగా ఆరోగ్యం సహకరించపోయినా మహేష్ ఫంక్షన్స్ కు కృష్ణ రాకుండా ఉండడు. దీనితో కృష్ణ ఆరోగ్యం ఎలా ఉంది అంటూ ఆ ఫంక్షన్ కు వచ్చిన చాలామంది ప్రముఖులు ఆరాలు తీసినట్లు టాక్. 

ఇలాంటి చర్చలు జరుగుతున్న పరిస్థితులలో దర్శకుడు అనీల్ రావిపూడి తన ఉపన్యాసంలో ఒక షాకింగ్ న్యూస్ బయట పెట్టాడు. అనీల్ రావిపూడి తండ్రి కృష్ణ వీరాభిమాని అట. అందువల్లనే ఒక విధంగా తాను సినిమాలలోకి వెళతాను అంటే తన తండ్రి గతంలో అభ్యంతరం చెప్పలేదు అంటూ తన లేటెస్ట్ మూవీకి సంబంధించి ఒక షాకింగ్ న్యూస్ బయటపెట్టాడు.

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీలో సూపర్ స్టార్ కృష్ణ కనిపించబోతున్న విషయాన్ని తెలియచేసి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే ఈ మూవీలో కృష్ణ ఎంట్రీ ఎలా ఉండబోతోంది అన్న విషయం మాత్రం సస్పెన్స్ అంటూ ఆ మూవీ విడుదల అయ్యేవరకు ఓపిక పెట్టమని మహేష్ అభిమానులకు సూచనలు చేసాడు. 

దీనితో ఈ మూవీలో కృష్ణ అందరికీ షాక్ ఇస్తూ ఏదైనా అతిథి పాత్ర చేసాడా లేదంటే గతంలో కృష్ణ నటించిన సినిమాలోని కొన్ని సీన్స్ ను ఈ సినిమా కథలో వచ్చే విధంగా అనీల్ రావిపూడి ప్లాన్ చేసాడా అంటూ అప్పుడే ఊహాగానాలు మొదలైపోయాయి. వాస్తవానికి కృష్ణ తన చివరి సినిమాగా మహేష్ గౌతమ్ సుధీర్ బాబు సీనియర్ నరేశ్ లతో కలిసి ఒక మూవీ చేయాలని ఎప్పటి నుంచో కలగంటున్నాడు. ఆ కల తీరకపోయినా తన తండ్రి కృష్ణకు జోష్ ఇచ్చే విధంగా మహేష్ సూచనతో సూపర్ కృష్ణ ప్రస్తావనను తన సినిమాలో వచ్చే విధంగా అనీల్ రావిపూడి సహకారంతో మహేష్ ప్లాన్ చేసి ఉంటాడు అంటూ చాలామంది అభిప్రాయ పడుతున్నారు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: