సినిమా ఈవెంట్స్ కు సంబంధించి పెద్ద ఫంక్షన్స్ జరిగాయి అంటేచాలు యాంకర్  సుమ లేకుండా ఆ ఫంక్షన్ పరి పూర్తి కావడంలేదు. పారితోషికం విషయంలో ఆమె తీసుకుంటున్న పేమెంట్ భారీ స్థాయిలో ఉన్నా సుమ ఫంక్షన్ నడిపించడంలో ఆమె కనపరిచే సమర్ధతను ఆమె ఎంతటి గొప్ప వ్యక్తిని అయినా డీల్ చేయగల ఆమె మాటతీరు చూసి ఆమెకు గంటకు లక్షల రూపాయలలో పారితోషికాలు ఇస్తున్నారు.  

ఇలాంటి పరిస్థితులలో  సుమ అనుకోకుండా నిన్నటి వేదిక పై వేసిన ఒక సెటైర్ ‘సరిలేరు’ మూవీ ఫంక్షన్ ని అవమాన పరిచేవిధంగా ఉంది అంటూ మహేష్ అభిమానులు సుమ పై మండిపడిపోతున్నారు. సుమ అనుకోకుండా వేసిన ఒక జోక్ ఆమె మెడకు చుట్టుకుంది. ఇక వివరాలలోకి  వేదిక పై మాట్లాడటానికి వచ్చిన హీరోయిన్ రష్మిక మందన్న అక్కడున్న అశేష అభిమాన వర్గాన్ని చూసి ఉబ్బితబ్బిబ్బయింది. 

నవ్వుతూ ఎంతో ఉత్సాహంతో వేదిక పైకి వచ్చిన రష్మిక ఒక నాలుగు మాటలు మాట్లాడాక ఇంతమంది మహేష్ అభిమానులను చూస్తుంటే తనకు ఏం మాట్లాడాలో తెలియడం లేదు అంటూ భావోద్వేగానికి లోనైంది. రష్మిక ఆ మాట అనగానే వెంటనే అందుకున్న సుమ ''పర్వాలేదు మాట్లాడు..ఎవరి డబ్బా వాళ్లు కొట్టుకోవాలి కదా.. మీరు మాట్లాడండి" అనేసింది. ఆ తర్వాత రష్మిక కొద్దిసేపు మాట్లాడి వేదిక దిగిపోయింది. దీనితో ఈ సంఘటను చూసిన మహేష్ అభిమానులు మాత్రం వేరే కోణంలో విశ్లేషిస్తున్నారు. 

అత్యంత భారీ స్థాయిలో జరుగుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ ఈవెంట్సినిమా నిర్మాతలు మహేష్ తమ డబ్బాను కొట్టుకోవడానికి ఏర్పాటు చేసుకున్నారని లక్షలు తీసుకున్న సుమ అభిప్రాయమా అంటూ ఆమెను కార్నర్ చేస్తున్నారు. పూర్వకాలంలో సంక్రాంతి కాలంలో వచ్చే గంగిరెద్దు వాళ్ళు ఎవరింటికి వెళ్ళి వారికి నచ్చినట్లుగా పొగడ్తలు కురిపిస్తూ బహుమతులు తీసుకు వెళ్ళినట్లుగానే సుమహీరో ఫంక్షన్ కు వస్తే ఆ హీరోను ఆకాశంలోకి ఎత్తేస్తూ పొగడటం ఆమె వృత్తి ధర్మం. దీనితో అత్యుత్సాహంతో సుమ చేసిన కామెంట్స్ మహేష్ అభిమానులకు వేరే విధంగా అర్ధం కావడం సుమ దురదృష్టం అనుకోవాలి..   

 

మరింత సమాచారం తెలుసుకోండి: