దర్శక ధీరుడు ఎస్ ఎస్  రాజమౌళి  దర్శకత్వంలో టాలీవుడ్  బిగెస్ట్ మల్టీస్టారర్ గా  తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  యంగ్ టైగర్ ఎన్టీఆర్ , మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ చిత్రం పై  దేశ వ్యాప్తంగా  భారీ అంచనాలు  వున్నాయి. ఇక ఈ చిత్రాన్ని2020 జులై 30న విడుదలచేస్తామని గత ఏడాదే  ప్రకటించారు. అయితే  షూటింగ్  ఆలస్యంగా స్టార్ట్  కావడంతో   సినిమా ఈఏడాది  విడుదలకాదని ఇటీవల రక రకాల వార్తలు వచ్చాయి  కానీ న్యూ ఇయర్  పోస్టర్ తో చిత్ర యూనిట్ రిలీజ్ విషయంలో కొద్దీ రోజుల క్రితం క్లారిటీ ఇచింది.  
 
తాజాగా రామ్ చరణ్  ఈరిలీజ్ డేట్ విషయంలో మరింత క్లారిటీ ఇచ్చాడు.  మొబైల్ విక్రయాల సంస్థ  హ్యాపీ మొబైల్స్ కి  రామ్ చరణ్ ప్రచార కర్త గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.  ఈరోజు   హ్యాపీ నూతన స్టోర్ ను విజయవాడ లో రామ్ చరణ్  ప్రారంభించాడు. ఈ సందర్భంగా  మీడియా తో మాట్లాడిన  చరణ్..  ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ విషయంలో  ఎటువంటి అనుమానాలు వద్దని అనుకున్న సమయానికే  విడుదలవుతుందని  రాజమౌళి  దానికి తగ్గట్లుగా  షూటింగ్  కంప్లీట్ చేస్తున్నాడని  వెల్లడించాడు. 
 
ప్రస్తుతం ఈ చిత్రం యొక్క  షూటింగ్  శరవేగంగా జరుగుతుంది. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో  తెరకెక్కుతున్న  ఈ చిత్రంలో చరణ్ కు జోడిగా బాలీవుడ్  హీరోయిన్  అలియా భట్ నటిస్తుండగా  ఎన్టీఆర్ కుజోడిగా  హాలీవుడ్ నటి  ఒలీవియా మోరిస్ కనిపించనుంది.  స్వాతంత్య్ర సమర యోధులు  అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత  చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా , రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తుండగా  ప్రముఖ రచయిత  బుర్రా సాయి మాధవ్  డైలాగ్స్  అందిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: