ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న పేరు ప్రతిష్టల గురించి కానీ.. అభిమాన బలం గురించి తెలియంది కాదు. టాలీవుడ్ ని తిరుగులేని నెంబర్ వన్ గా ఏలేశాడు. పదేళ్ల గ్యాప్ ఇచ్చి కూడా మళ్లీ వచ్చి తన ప్రస్థానాన్ని అప్రతిహతంగా కొనసాగిస్తున్న తిరుగులేని స్టార్ డమ్ చిరంజీవి సొంతం. చిరంజీవిని గౌరవిస్తూ తమ సినిమాల ఫంక్షన్లకు ఆహ్వానించాలని ఉవ్విళ్లూరుతున్న వారి సంఖ్యకు కొదవ లేదు. నిఖిల్, నాగశౌర్య, అఖిల్, విజయ్ దేవరకొండ, మహేశ్ బాబు.. ఇలా ప్రతి హీరోకు చిరంజీవి మెయిన్ ఛాయిస్ లా మారాడంటే అతిశయోక్తి కాదు.

 

 

రీసెంట్ గా జరిగిన మహేశ్ సరిలేరు నీకెవ్వరు సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు చిరంజీవి గెస్ట్ గా వచ్చి సంచలనం సృష్టించారు. ఆ కార్యక్రమం ఏస్థాయిలో హిట్ అయిందో తెలిసిందే. అయితే చిరంజీవి ఈ కార్యక్రమానికి రావడానికి ప్రధాన పాత్ర పోషించింది దర్శకుడు మెహర్ రమేశ్ అనే వార్త ఇప్పుడు ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. నిజానికి మెహర్ రమేశ్ చిరంజీవికి బంధువు. చిరంజీవితో సబంధాలుండటం వల్ల సరిలేరు.. కు అతిథిగా రప్పించేందుకు పావులు కదిపాడని అంటున్నారు. స్వతహాగా మహేశ్ అంటే మంచి అభిప్రాయమున్న చిరంజీవీ ఈ ఇన్విటేషన్ ను కాదనలేకపోయాడట.

 

 

మెహర్ రమేశ్ ప్రస్తుతం మహేశ్ కు బాగా దగ్గరి మనిషి అయిపోయాడు. మహేశ్ కు సంబంధించి అన్ని పనులూ, షెడ్యూల్స్ మెహర్ రమేశే చూస్తున్నాడు. కొన్నేళ్ల క్రితం నమ్రత తిరుమల వెళ్లినప్పుడు కూడా మెహర్ ఆమె వెంటే ఉన్నాడు. మహేశ్ నటించిన బాబి సినిమాలో మెహర్ రమేశ్ చిన్న పాత్రలో మెరిశాడు. మొదటి నుంచీ మహేశ్ తో ఉన్న స్నేహం.. చిరంజీవితో ఉన్న బంధుత్వమే సరిలేరు.. కు చిరంజీవి రాకకు కారణమైందని వస్తున్న వార్తలకు మెహర్ మాత్రమే సమాధానం చెప్పగలడు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: