బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ పింక్ తెలుగు లో రీమేక్ కానుందని తెలిసిందే. ఇటీవలే ఈ చిత్రం ఎలాంటి హడావిడి లేకుండా లాంచ్ అయ్యింది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ లో వున్న ఈ చిత్రం జనవరి 20నుండి సెట్స్ మీదకు వెళ్లనుందని వార్తలు వస్తున్నాయి. ఈ చిత్రం తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్ళీ సినిమాల్లో కి ఎంట్రీ ఇవ్వనున్నాడు. అయితే ఇప్పటివరకు పవన్ టీం నుండి మాత్రం దీని గురించి అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. పవన్ మాత్రం 20రోజులు డేట్స్ ఇచ్చాడని అలాగే ఈ చిత్రం చేయడం కోసం 50కోట్ల పారితోషికం తీసుకుంటున్నాడనే వార్తలు బలంగా వినిపిస్తున్నాయి. అన్ని కుదిరితే
పవన్ ఫిబ్రవరి రెండో వారంలో ఈ షూటింగ్ లో జాయిన్ కానున్నాడని సమాచారం.
సాలిడ్ సోషల్ మెసేజ్ తో రానున్న ఈ చిత్రంలో
పవన్ లాయర్ గా కనిపించనున్నాడు.
పవన్ తో పాటు
యువ హీరోయిన్లు
అంజలి,
నివేత థామస్ ముఖ్య పాత్రల్లో కనిపించనుండగా మల్లేశం ఫేమ్
అనన్య అలాగే యువనటుడు శత్రు సపోర్టింగ్ రోల్స్ లో నటించనున్నారు. ఇక 20 రోజుల పాటు జరుగనున్న మొదటి షెడ్యూల్ లో
అంజలి,
నివేత లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఎంసీఏ ఫేమ్ వేణు
శ్రీరామ్ ఈరీమేక్ ను డైరెక్ట్ చేయనుండగా ఎస్ ఎస్
తమన్ సంగీతం అందిస్తున్నాడు.
బాలీవుడ్ ప్రముఖ
నిర్మాత బోనీ కపూర్ తో కలిసి
దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మించనున్నాడు.
ఇక బిగ్ బి అమితాబ్ బచ్చన్ , తాప్సి ప్రధాన పాత్రల్లో నటించిన పింక్ 2016లో విడుదలై విమర్శకుల ప్రశంసలు పొందడమే కాకుండా కమర్షియల్ గా కూడా సక్సెస్ అయ్యింది. ఈచిత్రాన్ని గత ఏడాది కోలీవుడ్ లో అజిత్ తో రీమేక్ చేయగా అక్కడ కూడా అదే రిజల్ట్ వచ్చింది.