అత్త అంటే పిల్ల నిచ్చి కాళ్ళు కడిగి సరిపెట్టుకోవడం ఒకప్పటి రోజుల్లో.. అప్పటిలో కూతురిని ఇచ్చి వివాహం చేసి పండగకు వచ్చినప్పుడు అల్లుడికి కావలసిన వన్నీ చేసి పెట్టి ఉన్నన్ని రోజులు బాగా చూసుకుంటే అమ్మాయిని బాగా చూసుకుంటాడని చాలా మంది అనుకోని అలానే చేసేవారు. కానీ ఇపుడు కాలం మారింది.
ఇప్పుడు ఎవడైనా అల్లుడు కూతురు విషయం లో అల్లుడు తోకజాడిస్తే తోలు తీసి బెండ్ తీస్తున్నారు. అదే ఇప్పటి అత్తల స్టైల్.. ఇకపోతే ఏదైనా అల్లుడు చేయాలనీ చుస్తే దేహశుద్దీ చేస్తున్నారు. అయితే వివరాల్లోకి వెళితే.. ఓ అల్లుడు గొడవపడి నిండు గర్భవతి అయిన తన భార్యను తన వెంట పంపించాలని డిమాండ్ చేశారట. దానికి అత్త ఎంత చెప్పిన కూడా అతను ససేమీరా అనడంతో ఒళ్ళు వచ్చేలా కొట్టింది,.
ఈ ఘటన చెన్నైలో జరిగింది. వివరాలిలా.. బాలింత అయిన భార్యని తక్షణమే తన వెంట పంపమని మామగారి ఇంట్లో గొడవకు దిగిన అల్లుడికి అత్తమామలు దేహశుద్ధి చేశారు. తంజావూర్ సమీపంలోని రెడ్డి పాళ్యం మేట్టు వీధికి చెందిన జయశీలన్, అదే ప్రాంతానికి చెందిన మారిముత్తు కుమార్తె దేవికా వివాహామాడాడు. అది కూడా ప్రేమించి రెండేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. ఈ స్థితిలో దేవికా గర్భం దాల్చింది. ప్రసవం కోసం తల్లిదండ్రులకు వద్దకు వెళ్లింది. ప్రసవం ముగిసి బిడ్డతో దేవికా, కన్నవారు, సహోదరుడు దేవాతో ఇంట్లో ఉంది.
ఇటీవల జయశీలన్, మామ మారిముత్తు ఇంటికి వెళ్లి భార్య, బిడ్డని పంపించాలని కోరాడు. దానికి దేవికా బాలింత అని మరో నెల రోజులు తరువాత పంపిస్తానని మారిముత్తు తెలిపాడు. దీంతో జయశీలన్ అత్తామామలతో గొడవకు దిగాడు. దీంతో మారిముత్తు కుటుంబ సభ్యులు జయశీలన్కు దేహశుద్ధి చేశారు. ఈ గొడవలో దేవాకి గాయమయింది. ఇద్దరు తంజావూర్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.