మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రమోషన్ కోసం రకరకాల పద్ధతులను అనుసరిస్తూ ఈ మూవీకి ఈ సంక్రాంతి సీజన్ పూర్తి అయ్యేలోగా అత్యంత భారీ కలెక్షన్స్ రాబట్టడానికి తన వంతు ప్రయత్నాలు గట్టిగానే చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమాకు  సంబంధించిన  ప్రచారకార్యక్రమాలతో బిజీగా ఉంటూ అనేక మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తూ తన సినిమా గురించి విశేషాలను వెల్లడిస్తూ హైప్ ను క్రియేట్ చేస్తున్న మహేష్ మరో వినూత్న ప్రమోషన్ కు శ్రీకారం చుట్టాడు.

ఈవ్యూహాలలో  భాగంగా పాపులర్ టీవీ సీరియల్ తూర్పు పడమరలో  కనిపించ బోతున్నాడు. ‘జీ’ తెలుగు ఛానెల్ లో ప్రసారం అయ్యే ఈ సీరియల్ ప్రోమోకు సంబంధించిన షూటింగ్ ఈమధ్య తాజ్ డెక్కన్ హోటల్ లో జరిగింది అన్న వార్తలు వస్తున్నాయి.

అయితే ఈ షూట్ లో మహేష్ తో పాటుగా యాంకర్ ప్రదీప్ మాచిరాజు కూడా పాల్గొన్నాడు అని తెలుస్తుంది. ఇక ఈ సీరియల్ ఎపిసోడ్ లో మహేష్ బాబు అతిథి పాత్రలో కనిపిస్తాడా లేదంటే తూర్పు పడమర నటీనటులతో ముచ్చటిస్తారా అనే విషయం పై క్లారిటీ లేదు.  

ఇది ఇలా ఉంటే ఈరోజు రాష్ట్రాలలో ఇప్పటికే వేయబడ్డ ఈమూవీ స్పెషల్ షోలకు ప్రీమియర్ షోలకు స్పందన బాగా రావడమే కాకుండా టాక్ కూడ పాజిటివ్ గా వస్తున్న నేపధ్యంలో ఈ మూవీ ప్రమోషన్ ను మరింత వేగవంతం చేసి సంక్రాంతి మ్యానియాను ఉపయోగించుకుని ఎదో విధంగా నాన్ బాహుబలి రికార్డులను బ్రేక్ చేయాలని మహేష్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. అయితే ఈసారి ఎప్పుడు లేని విధంగా పోటీ విపరీతంగా ఉన్న పరిస్థితులలో మహేష్ పెట్టుకున్న టార్గెట్ అంత సులువుగా అతడికి దక్కే అవకాశం కనిపించడం లేదు. దేనితో మహేష్ అవసరం అనుకుంటే ఈ మూవీ ఫైనల్ టాక్ ను బట్టి మన తెలుగు రాష్ట్రాలలోని కొన్ని ఊళ్ళలోని ధియేటర్స్ కు వెళ్ళి ఈ మూవీ మ్యానియాను మరింత పెంచే ప్లాన్ లో ఉన్నాడు..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: