సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సరిలేరు నీకెవ్వరు సినిమా ఈరోజు విడుదలైంది. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. సోషల్ మీడియాలో మహేష్ బాబు అభిమానులు సరిలేరు నీకెవ్వరు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


కానీ ఈ సినిమాలో కామెడీ హద్దులు దాటిందని కామెడీ పేరుతో అతి చేసి ప్రేక్షకులకు అనిల్ రావిపూడి చిరాకు తెప్పించాడని కొందరు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలోని రష్మిక పాత్ర కామెడీ పేరుతో చేసే అతి ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తుంది. దర్శకుడు అనిల్ రావిపూడి గత సినిమాలో కామెడీ చాలా బాగుందని కానీ ఈ సినిమాలో మాత్రం కామెడీ కోసం చేసిన అతి వెగటు పుట్టిసోందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. 
 
కామెడీ కూడా బలవంతంగా రుద్దినట్టు ఉందని ఇలాంటి అతి కామెడీ వలన సినిమాకు నష్టమే కానీ లాభం చేకూరదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అతి కామెడీ సినిమా ఫైనల్ రిజల్ట్ పై కూడా ప్రభావం చూపే అవకాశం ఉందని తెలుస్తోంది. ఈ అతి కామెడీ సినిమా గతినే మార్చే అవకాశం ఉందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. కామెడీ, యాక్షన్ సన్నివేశాలతోనే సినిమాను నడిపించటం కూడా సినిమాకు కొంత మైనస్ గా మారింది. 
 
అనిల్ రావిపూడి కూడా కామెడీ, యాక్షన్ ను నమ్ముకుని రొటీన్ మాస్ మసాలా సినిమాలు తీస్తున్నాడని కొత్త కథలను ఎంచుకోకపోతే భవిష్యత్తులో అనిల్ రావిపూడి సినిమాలు ఆకట్టుకోవటం కష్టమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సినిమాకు ఇంటర్వెల్, సెకండాఫ్ లో 30 నిమిషాలు, మహేష్ బాబు నటన హైలెట్ గా నిలిచాయి. క్లైమాక్స్ విషయంలో కూడా అనిల్ రావిపూడి కొన్ని జాగ్రత్తలు తీసుకొని ఉంటే బాగుండేదని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: