నిర్మాత అశ్విని దత్ టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్రనిర్మాత మాత్రమే కాకుండా వివాదాలకు  దూరంగా ఉంటాడు. మెగాస్టార్ చిరంజీవితో సీనియర్ నిర్మాత అశ్విని దత్‌ కు ఉన్న అనుబంధం ఈనాటిది కాదు. వీళ్ల కలయికలో వచ్చిన ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ ‘ఇంద్ర’ లాంటి ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు వచ్చాయి. 

వాస్తవానికి చిరంజీవి కూడ అశ్విని దత్ అంటే చిరు ప్రత్యేకమైన అభిమానంతో ఉంటాడు. ఇలాంటి పరిస్థితులలో ఈ ప్రముఖ నిర్మాత చిరంజీవిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేయడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. వాస్తవానికి గతంలో దత్ మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో ఉండగా చిరు తర్వాత ప్రజారాజ్యం పార్టీ పెట్టి కొన్నేళ్ల ప్రయాణం తర్వాత రాజకీయాలకు స్వస్తి చెప్పిన విషయం తెలిసిందే.

ప్రస్తుతం ఈ ఇద్దరు క్రియాశీల రాజకీయాల్లో లేరు. ఇలాంటి సమయంలో చిరు మీద అశ్వినీ దత్‌ తో తీవ్ర అసహనానికి గురవుతూ విమర్శలు చేయడం వెనుక ఆంతర్యం ఏమిటి అంటూ చాలామంది ఆశ్చర్య పడుతున్నారు. ఇటీవల ఏపీ సర్కారు ప్రతిపాదించిన మూడు రాజధానుల ఆలోచనకు చిరంజీవి మద్దతు ప్రకటిస్తూ ప్రెస్ నోట్ ఇచ్చిన విషయం తెలిసిందే. 

దీని పై ఒక ఇంటర్వ్యూలో అశ్విని దత్ స్పందిస్తూ చిరంజీవికి ఏమి తెలుసని మూడు రాజధానుల ప్రతిపాదనపై మాట్లాడారని అంటూ అశ్విని దత్ చిరంజీవిని టార్గెట్ చేస్తూ కామెంట్ చేసాడు.  ఒక పక్క పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం కష్టపడుతున్నారని అమరావతి నుంచి రాజధాని తరలించకూడదని పోరాడతున్నారని అక్కడి రైతులకు మద్దతుగా విషయాన్ని వివరిస్తూ ఇలాంటి సమయంలో చిరంజీవి వచ్చి మూడు రాజధానుల ప్రతిపాదనకు మద్దతు పలకడం ఎంత వరకు సమంజసం అంటూ అశ్విని దత్ ప్రశిస్తున్నాడు. ఇప్పటికే ఈ విషయమై పవన్ చిరంజీవిల మధ్య గ్యాప్ ఉంది అన్న ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో లేటెస్ట్ గా అశ్విని దత్ చేసిన కామెంట్స్ చాలామందికి షాక్ ఇస్తున్నాయి..

 

మరింత సమాచారం తెలుసుకోండి: