కోలీవుడ్ టాప్ హీరో విజయ్ ఎంత ప్రయత్నించినా అతడి క్రేజ్ తెలుగు ప్రేక్షకులలో పెరగడం లేదు. అదేవిధంగా సూపర్ స్టార్ మహేష్ బాబు ఎంతగా ప్రయత్నించినా  అతడి మ్యానియా తమిళ ప్రేక్షకులలో పెరగడంలేదు. 

దీనితో విజయ్ మహేష్ సినిమాలకు సంబంధించిన రికార్డులు బ్రేక్ చేయడానికి అదేవిధంగా వీరిద్దరూ నేషనల్ సెలెబ్రెటీ లుగా మారడానికి పరిస్థితులు పూర్తిగా అనుకూలించక పోవడంతో మహేష్ విజయ్మార్కెట్ తమతమ రాష్ట్రాలకు మాత్రమే పరిమితం అవుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితులలో వీరిద్ధరితోను మంచి సాన్నిహిత్యం ఉన్న దర్శకుడు మురగదాస్ వీరిద్దరిని కలిపి ఒక మల్టీ స్టారర్ తమిళ తెలుగు భాషలలో తీసే ఆలోచనలలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.

‘దర్బార్’ మూవీని ప్రమోట్ చేస్తూ మురగదాస్ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ను బట్టి ఇలాంటి ఊహాగానాలు వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు తరువాత బ్రేక్ తీసుకుని వంశీ పైడి పల్లితో సినిమా చేయబోతున్నాడు. ఈ సినిమా తరువాత విజయ్ మహేష్ ల మల్టీ స్టారర్ ఉండవచ్చు అన్న లీకులు వస్తున్నాయి. 

దీనికితోడు ఈమధ్య విజయ్ ఒక తమిళ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మహేష్ ‘సరిలేరు నీకెవ్వరు’ ఘన విజయం సాధించాలి అని చేసిన కామెంట్స్ ను బట్టి వీరిద్దరి మల్టీ స్టారర్ ఉంటుంది అన్న ప్రచారం మొదలైంది. ప్రస్తుతం టాప్ హీరోలు అంతా మల్టీ స్టారర్ మూవీలు చేయడానికి ఆసక్తి కనపరుస్తున్న పరిస్థితులలో అన్నీ అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది మహేష్ విజయ్ ల మల్టీ స్టారర్ ఉంటుంది అంటూ కోలీవుడ్ మీడియా ఊహాగానాలు చేస్తోంది. ఇది చాలదు అన్నట్లుగా ‘సరిలేరు నీకవ్వరు’ మూవీ ప్రమోషన్ లో మహేష్ ను విజయ్ తో కలిసి మల్టీస్టారర్ చేయడానికి మీరు సిద్దంగా ఉన్నారా ? అని తమిళ మీడియా ఇంటర్వూలో ప్రశ్నించగా తాను సిద్ధమేనని అంటూ కామెంట్స్ చేయడంతో ఈ ఊహాగానాలు నిజం అయ్యే అవకాశాలు చాల ఎక్కువగా ఉన్నాయి..  

మరింత సమాచారం తెలుసుకోండి: