టాలీవుడ్ అగ్రహీరో మాస్ మహారాజా రవితేజ కు ఈ మధ్య కాలంలో ఒక్క హిట్ కూడా పడలేదు.. అందుకే ఈసారి హిట్ ను గట్టిగా కొట్టాలని బాగానే ట్రై చేస్తున్నాడు.. ఇది ఇలా ఉండగా ప్రస్తుతం రవితేజ డిస్కో రాజా సినిమాలో నటిస్తున్నారు.హాలీవుడ్ రేంజులో ఈ సినిమా రూపొందింది..అందుకే ఈ సినిమాపై ఈ మాస్ హీరో ఎన్నో ఆశలు పెట్టుకున్నారు..

 

ఇకపోతే..రవితేజ హీరోగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘డిస్కోరాజా’. పాయల్ రాజ్‌పుత్, నభా నటేష్, తాన్య హోప్ హీరోయిన్లుగా నటించారు. బాబీ సింహా ప్రతినాయకుడి పాత్ర పోషించారు. వెన్నెల కిషోర్, సత్య ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తోన్న ఈ చిత్రాన్ని ఎస్‌ఆర్టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రజిని తాళ్లూరి నిర్మిస్తున్నారు. జనవరి 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

 

ఇప్పటికే విడుదలైన టీజర్ విశేషంగా ఆకట్టుకుంది. రవితేజ స్టైలిష్ లుక్‌తో అభిమానులను అలరించారు. అయితే, తాజాగా రెండో టీజర్‌ను విడుదల చేశారు. ఈ టీజర్‌లో విలన్ పాత్రను పరిచయం చేశారు. ఈ సినిమాలో విలన్ పాత్ర పేరు సేతు. ఇప్పటి వరకు తమిళ సినిమాల్లో విలన్‌గా అలరించిన తెలుగు నటుడు బాబీ సింహా.. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నారు. ‘‘సేతు అంటే గుర్తుకు రావాల్సింది వయసు కాదు, భయం.. భయం గుర్తుకురావాలి’’ అంటూ బాబీ సింహా చెప్పే డైలాగ్ టీజర్‌లో హైలైట్‌ అవుతోంది.

 

ఇక ఆ తరవాత రవితేజ ఎంట్రీ అదిరిపోయింది. టీజర్లు చూస్తుంటే ఈ సినిమాలో రవితేజ చాలా కొత్తగా కనిపించనున్నట్టు అర్థమవుతోంది. పిక్చరైజేషన్ కూడా చాలా బాగుంది. ‘‘ఎనీవన్ ఎల్స్.. వాన్నా డ్యాన్స్ విత్ మి?’’ అనే డైలాగ్ చెప్పి హెడ్ ఫోన్స్ పెట్టుకుని మ్యూజిక్‌కి డ్యాన్స్ చేస్తూ గన్‌తో విలన్‌ను కాల్చుతూ ‘‘ఐ లవ్ ఫ్రీకింగ్ ఫియర్ ఇన్ యువర్ ఐస్’’ అని రవితేజ చెప్పే డైలాగ్‌తో టీజర్ ముగిసింది. టీజర్‌లో వచ్చిన సీన్లలో తమన్ ఇచ్చిన నేపథ్య సంగీతం కూడా ఆకట్టుకుంటోంది. మొత్తం మీద ఈ సినిమాతో మాస్ మహారాజా మళ్లీ ఫామ్‌లోకి వచ్చేటట్టే కనిపిస్తున్నారు.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 24న ప్రేక్షకుల ముందుకు రానుంది...

 

మరింత సమాచారం తెలుసుకోండి: