ప్రముఖ రచయిత నటుడు పోసాని కృష్ణమురళి ఏం చేసిన కూడా అది సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.. ఎన్నో సినిమాలలో నటించిన ఆయన తన కామెడీ టైమింగ్ తో చాలా మంది ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు.. అయితే ఈయన ఈ మధ్య రాజకీయాల్లోకి కూడా ఎంట్రీ ఇచ్చడన్న సంగతి తెలిసిందే..అయితే ఆయన సినిమాల్లో లాగే మనస్తత్వం కూడా గడుసు అని అంటారు..

 

అయితే, తాజాగా పోసాని కృష్ణమురళి ఎన్టీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. ప్రస్తుతం అవి సోషల్ మీడియా లో రచ్చ చేస్తున్నాయి.. ఏదైనా చేయాలంటే పోసాని కృష్ణమురళి తర్వాత నే అన్న సంగతి తెలిసిందే... ఈ మధ్య సినీ ఇండస్ట్రీలో ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే.. అటు టీడీపీ పార్టీలో కూడా ఆ వార్త తెగ షికారు చేసింది..

 

టీడీపీ పార్టీ మళ్ళీ ఫాంలో కి రావాలంటే.. జూనియర్ ఎన్టీఆర్ సీఎం అవ్వాలని అందరూ అంటున్నారు..ఈ విషయం పై తాజాగా పోసాని కూడా స్పందించారు.. ప్రజల్లో ఎన్టీఆర్ మీద నమ్మకం ఉంటే గొప్ప నాయకుడవుతాడు ..అంటూ ఆయన అన్నారు..  లేకుంటే చంద్రబాబు నాయుడు లాగా ప్రజల్లో మోసగాడు లాగా మిగిలిపోతారు..అంటూ ఆయన అన్నారు..ముఖ్యమంత్రి కావాలంటే ఏం చేయాలో చెబుతూ తనదైన మార్కు సలహాలు ఇచ్చాడు. అందులో ముఖ్యమైన పాయింటు ఏంటంటే...

 

ప్రజల్లో నమ్మకం ఉంటే జూనియర్ ఎన్టీఆర్ తప్పకుండా ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందని అన్నాడు. అది జరగక పోతే  చంద్రబాబు లాగా మోసం చేసే తెలివితేటలైనా ఉండాలని పోసాని అన్నారు. అంతేకాదు సీనియర్ ఎన్టీఆర్ తన విల్ పవర్ తో సీఎం కాగలిగారని, అలాగే జూనియర్ ఎన్టీఆర్ సైతం నిబద్ధత, ప్రజల పట్ల ప్రేమ ఉంటే కచ్చితంగా సీఎం అయ్యే అవకాశం ఉందన్నారు. ప్రజలకు నమ్మకం ఉంటే ఎలాంటి వారైనా సీఎం అయ్యే అవకాశం ఉందని పోసాని అన్నారు.

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: