తెలంగాణ గడ్డ వరంగల్ లో నిన్న సాయంత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ విజయోత్సవ సభ అత్యంత ఘనంగా జరిగింది. వేల సంఖ్యలో మహేష్ అభిమానులు హాజరైన ఈ ఫంక్షన్ లో ఒక షాకింగ్ విషయాన్ని మహేష్ బయట పెట్టాడు. 

‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ కథలో సూపర్ స్టార్ కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్ర ప్రస్తావన అనేక సార్లు కనిపిస్తుంది. దర్శకుడు అనీల్ రావిపూడి తండ్రి సూపర్ స్టార్ కృష్ణ అభిమాని కావడంతో అతడి ప్రభావంతో అనీల్ రావిపూడి చిన్నతనంలో తన తండ్రితో కలిసి కృష్ణ నటించిన అనేక సినిమాలను చూసిన విషయాన్ని స్వయంగా అనీల్ రావిపూడి గతంలో బయటపెట్టాడు. 

ఇప్పుడు ఆ అభిమానంతో మళ్ళీ అనీల్ రావిపూడి ఘట్టమనేని మల్టీ స్టారర్ చేయబోతున్నాడా అన్న సంకేతాలు వస్తున్నాయి.తాను తన తండ్రితో కలిసి ఒక మల్టీ స్టారర్ లో నటించాలి అన్న నిర్ణయం తీసుకున్నానని అయితే అలాంటి సినిమాకు కథ వ్రాయగల సమర్ధుడు అనీల్ రావిపూడి మాత్రమే అంటూ మహేష్ తన అభిమానులకు జోష్ ను ఇచ్చే విషయాన్ని బయటపెట్టాడు. 

అంతేకాదు త్వరలోనే అనీల్ రావిపూడి తన తండ్రి కృష్ణను కలవబోతున్నాడు అంటూ షాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడు. వాస్తవానికి కృష్ణకు తన కొడుకు మహేష్ సూపర్ స్టార్ అయిన తరువాత కలిసి నటించాలి అన్న కోరిక ఉంది. అయితే గతంలో కృష్ణ మహేష్ లు కలిసి నటించిన సినిమాలు అన్నీ ఫ్లాప్ అయిన సెంటిమెంట్ ఉంది. ‘సరిలేరు నీకెవ్వరు’ లో పలు సార్లు సూపర్ స్టార్ కృష్ణ కనిపించినా ఆ సినిమా విజయవంతం అయిన పరిస్థితులలో మహేష్ తన సెంటిమెంట్ ను పక్కకు పెట్టి తన తండ్రి చిరకాల కోరిక తీర్చబోతున్నాడు అనుకోవాలి. ఈ ఆలోచనలు నిజంగానే వాస్తవ రూపం దాలుస్తాయా లేదంటే ‘సరిలేరు నీకెవ్వరు’ మూవీ సక్సస్ కిక్ ఇచ్చిన ఆనందంలో తన తండ్రి కృష్ణకు ఆనందం కలిగించడానికి మహేష్ అన్న మాటలు మాత్రమేనా అన్న విషయం రానున్న రోజులలో తెలుస్తుంది..  

 

మరింత సమాచారం తెలుసుకోండి: