ఈమధ్య ఒక్క హిట్ సినిమాలు లేని రవితేజ ప్రస్తుతం ఓ సినిమాలో ఆ సినిమానే డిస్కో రాజా.. విఆనంద్ దర్శకత్వం లో ఈ సినిమా రూపొందుతుంది.. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్దమవుతోంది..కాగా తాజాగా ఈ ప్రమోష్లలో భాగంగా ఆదివారం నాడు ఈవెంట్ ను ఏర్పాటు చేశారు.. ఆ ఈవెంట్ సందడి మామూలుగా లేదని చెప్పాలి..


రవితేజ, నభా నటేష్, పాయల్ రాజ్‌పుత్, తాన్య హోప్ హీరోహీరోయిన్లుగా వీఐ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా ‘డిస్కోరాజా’. సాయి రిషిక సమర్పణలో ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఈనెల 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తోంది..


ఈ ప్రీ రిలీజ్ వేడుకలో రవితేజ మాట్లాడుతూ.. ‘‘ఈ సినిమాను నేను ఎంత ఎంజాయ్ చేస్తూ చేశానో.. రేపు మీరు కూడా థియేటర్‌లో అంతే ఎంజాయ్ చేస్తారని నా స్ట్రాంగ్ ఫీలింగ్, నమ్మకం. ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేయడానికి ముఖ్య కారకుడు వీఐ ఆనంద్. ఈ సినిమా ద్వారా బాబీ సింహా, రాంకీలతో తొలిసారి కలిసి పనిచేశాను. ఆ వర్కింగ్ ఎక్స్‌పీరియన్స్ చాలా బాగుంది. సునీల్‌తో చాలా గ్యాప్ తరవాత కలిసి పనిచేశాను. ఈ సినిమాలో నటించిన అందరితో మామూలుగా ఎంజాయ్ చేయలేదు’’ అని చెప్పారు.


ఇకపోతే ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు. ఈ సంద్భంగా రవి తేజ మాట్లాడుతూ.. మ్యూజిక్‌ డైరెక్టర్‌ తమన్‌తో తనకు ఇది పదకొండో సినిమా అని.. ‘క్రాక్’ పన్నెండో సినిమా అవుతుందని చెప్పారు రవితేజ. ‘‘తమన్ బ్రహ్మాండమైన మ్యూజిక్ ఇచ్చాడు. ఆ సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో మీకు తెలుసు. నిర్మాత రామ్ తాళ్లూరితో నాకు ఇది రెండో సినిమా. ఇంతకు ముందు సినిమా నిరాశపరిచింది. ఈ సినిమా మాత్రం అలా చేయదు. నాకు నమ్మకం ఉంది. రచయిత అబ్బూరి రవి నన్ను దృష్టిలో పెట్టుకుని మాటలు రాశానని చెప్పారు. చాలా బాగా రాశారు. ఇక పాటల విషయంలో శాస్త్రి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు’’ అని రవిజేత వెల్లడించారు.. ఈ సినిమా తర్వాత రవితేజ ఇప్పుడు మరో సినిమాలో నటిస్తున్నారు..

మరింత సమాచారం తెలుసుకోండి: