టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఆ కుటుంబం నుంచి ఏ హీరో వచ్చినా ప్రేక్షకుల్లో, మెగా అభిమానుల్లో ఓ బజ్ క్రియేట్ అవుతుంది. అందుకే చిరంజీవి నుంచి ఆయన చిన్నల్లుడు కల్యాణ్ దేవ్.. త్వరలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న వైష్ణవ్ తేజ్ వరకూ అందరినీ మెగా అభిమానులు తమ సొంతంగా భావిస్తూంటారు. అంతటి క్రేజ్ కు కారణం మెగాస్టార్ చిరంజీవి.

 

 

ఆయన ఫ్యామిలీ నుంచి మరో హీరోగా ఆయన చిన మేనల్లుడు.. హీరో సాయిధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ త్వరలోనే ఉప్పెన సినిమా ద్వారా తెరంగేట్రం చేయబోతున్నాడు. త్వరలో ఈ సినిమా విడుదల కానుంది. అయితే వైష్ణవ్ తేజ్ తర్వాతి సినిమా గురించి అప్పుడే ఓ పుకారు షికారు చేసింది. టాలెంటెడ్ లేడీ డైరక్టర్ నందిని రెడ్డి దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ హీరోగా ఓ సినిమా తెరకెక్కబోతోందనే వార్త ఫిలింనగర్ లో షికారు చేసింది. ఈ సినిమాను కామెడీ జోనర్ లో తీయబోతున్నారని ఇందుకు వైష్ణవ్ ను హీరోగా అనుకుంటున్నారని ఓ వార్త వచ్చింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మిస్తోందని కూడా వార్తలు వచ్చేశాయి.

 

 

ఒక సినిమా కూడా రిలీజ్ కాకుండా వైష్ణవ్ కు రెండో సినిమా వచ్చిందని.. పైగా మెగా హీరో కూడా కావడంతో ఈ వార్తకు ప్రాముఖ్యం ఏర్పడింది. ఈ వార్త ఇలా రౌండ్స్ అవుతూ నందిని రెడ్డి వరకూ చేరిపోయింది. దీంతో ఆమె ఈ వార్తపై స్పందించారు. ఈ వార్తల్లో ఎటువంటి నిజం లేదని ఆమె తేల్చి చెప్పింది. తాను వైష్ణవ్ హీరోగా ఎటువంటి సినిమా అనుకోలేదని ఇదంతా ఫేక్ న్యూస్ అని తేల్చేసింది నందిని రెడ్డి. ఇటువంటి పుకార్లు ఎలా వస్తాయో అని కూడా ఆమె అంటోంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: