ఇక ఈ చిత్రంలో రాజీవ్ కనకాల , దేవయాని, ఈశ్వరి రావు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఏషియన్ సినిమాస్ , అమిగోస్ క్రియేషన్స్ బ్యానర్ల పై నారాయణ దాస్ నారంగ్ , రామ్ మోహన్ రావు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ శిష్యుడు పవన్ సంగీతం అందిస్తున్నాడు. అతనికిదే మొదటి సినిమా. వచ్చే నెల ఫిబ్రవరి 14న ప్రేమికుల రోజు కానుకగా ఈసినిమా టీజర్ ను విడుదలచేయనున్నారని తెలుస్తుంది. ఇక ఏప్రిల్ 2న ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉంటేసాయి పల్లవి ఈచిత్రం తోపాటు ప్రస్తుతం తెలుగులో నీదినాది ఒకే కథ ఫేమ్ వేణు ఉడుగుల డైరెక్షన్ లో
విరాటపర్వం అనే చిత్రంలో నటిస్తుండగా నాగ చైతన్య మాత్రం లవ్ స్టోరీ తరువాత ఇప్పటివరకు మరో సినిమాను లైన్లో పెట్టలేదు.