టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం ప్రభాస్ కు ఉన్నంత క్రేజ్ మరే స్టార్ హీరోకు లేదంటే అతిశయోక్తి కాదు. ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ లో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ వర్షం సినిమాతో తొలి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. ఆ తరువాత రాజమౌళి ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన ఛత్రపతి సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కెరీర్ మొదట్లో ఒక హిట్ రెండు ఫ్లాపులుగా ఉన్న ప్రభాస్ కెరీర్ మిర్చి సినిమా నుండి ఊపందుకుంది. 
 
కొరటాల శివ ప్రభాస్ కాంబినేషన్లో తెరకెక్కిన మిర్చి సినిమా బ్లాక్ బస్టర్ ఫలితాన్ని అందుకుంది. హీరో ప్రభాస్ ను దర్శకుడు కొరటాల శివ ఈ సినిమాలో సరికొత్తగా చూపించాడు. ఆ తరువాత ప్రభాస్ రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలలో నటించాడు. ఈ రెండు సినిమాలతో ప్రభాస్ కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ప్రభాస్ ను వచ్చిన క్రేజ్ కు, ప్రభాస్ సినిమాకు వస్తున్న కలెక్షన్లను చూసి షాక్ అవ్వడం టాలీవుడ్ స్టార్ హీరోల వంతయింది. 
 
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతటి స్టార్ హీరో అయినా సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చిందంటే థియేటర్లు ఖాళీ అయిపోతున్నాయి. బ్లాక్ బస్టర్ హిట్టైన సినిమాలకే 100 కోట్ల రూపాయల షేర్ రావడం కష్టంగా ఉంది. 2019 ఆగష్టు నెలలో విడుదలైన ప్రభాస్ సుజీత్ కాంబినేషన్లో తెరకెక్కిన సాహో సినిమాకు రిలీజ్ రోజునే నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూలు వచ్చాయి. కానీ సాహో సినిమా 450 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సాధించింది. 
 
ప్రభాస్ సినిమాకు నెగిటివ్ టాక్, నెగిటివ్ రివ్యూలు వస్తేనే బ్లాక్ బస్టర్ స్థాయి కలెక్షన్లు వస్తుంటే ప్రభాస్ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్స్ కు ఆకాశమే హద్దు అని చెప్పవచ్చు. మిర్చి సినిమా నుండి టాలీవుడ్ లో ప్రభాస్ వరుస విజయాలు సాధిస్తున్న తీరు, కలెక్షన్లలో కొత్త రికార్డులను క్రియేట్ చేస్తున్న తీరు చూస్తుంటే టాలీవుడ్ స్టార్ హీరోల మైండ్ బ్లాంక్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: