2.0 అనగానే గుర్తుకు వచ్చేది రజినీకాంత్ విన్యాసాలు.  చిట్టి రోబో చేసే సాహసాలు సినిమాకు హైలైట్ గా నిలిచాయి.  ఇందులో కంపాక్ట్ వెర్షన్ 3.0 కూడా సినిమాలో అదరగొట్టింది.  ఇక ఇదిలా ఉంటె, ఇందులో విలన్ గా అక్షయ్ కుమార్ నటించారు.  అక్షయ్ కుమార్ పక్షిరాజా గా కనిపించాడు.  తాను ఎంతో ప్రేమతో పెంచుకునే పక్షులు రేడియేషన్ ధాటికి మరణిస్తుండటంతో, అతను సెల్ టవర్ కు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంటాడు.  అక్కడి నుంచి అతని ఆత్మ పక్షుల్లోకి ప్రవేశిస్తుంది.  


ప్రపంచంలో సెల్ ఫోన్లు వాడే అందరిని చంపేయాలని చూస్తుంది.  ఆ సమయంలో వశీకరన్ ఏం చేశాడు అన్నది కథ.  టెక్నికల్ గా సినిమా బాగున్నా, కొన్ని ఇబ్బందులు పడింది.  సినిమా పదేపదే వాయిదా పడుతూ రావడంతో ఆలస్యం అయ్యింది.  ఈ ఆలస్యమే సినిమాకు దెబ్బపడింది.  ఇకపోతే, సినిమాలో సాహసం చేసినట్టుగానే రజినీకాంత్ ఇటీవలే రియల్ లైఫ్ లో కూడా సాహసాలు చేశారు.  


కర్ణాటకలోని బందీపూర్ టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ లో మ్యాన్ వర్సెస్ వైల్డ్ బేర్ గ్రిల్స్ తో కలిసి సాహసం చేశారు. ప్రధాని మోడీ తరువాత ఆ గౌరవం దక్కించుకున్న వ్యక్తిగా రజినీకాంత్ నిలిచారు.  రజినీకాంత్ తో కలిసి చేయడం వలన ఈ కార్యక్రమానికి గొప్ప పేరు వస్తుంది.  సౌత్ లో ఈ కార్యక్రమాన్ని అధికంగా వీక్షిస్తారు.  ఇదిలా ఉంటె రజినీకాంత్ తరువాత ఇప్పుడు బేర్ గ్రిల్స్ మరో స్టార్ తో ఈ ప్రోగ్రాం చేస్తున్నారు.  


ఆయనే పక్షిరాజా అక్షయ్ కుమార్.  అక్షయ్ కుమార్ తో బందీపూర్ ఫారెస్ట్ లోనే ఈ కార్యమ్రమం చేస్తున్నారట.  దీని వలన నార్త్ లో ఈ కార్యక్రమానికి పేరు వచ్చే అవకాశం ఉన్నది. రజినీకాంత్, అక్షయ్ కుమార్ ఇద్దరు కూడా ఈ కార్యమ్రంలో పాల్గొనడంతో ఇండియాలో మ్యాన్ వెర్సెస్ వైల్డ్ కార్యక్రమానికి మంచి వస్తుందని అంటున్నారు. దీంతో పాటుగా ఇండియాలోని మరికొంతమంది స్టార్స్ తో ఈ కార్యక్రమం చేసే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తోంది.  టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ తో కూడా బేర్ గ్రిల్స్ ఈ కార్యక్రమం చెయ్యొచ్చని అంటున్నారు.  ఇది ఎప్పుడు చేస్తారో తెలియదు.  

మరింత సమాచారం తెలుసుకోండి: