విలక్షణ నటుడు పోసాని కృష్ణ మురళి కి తిక్క ఎక్కువ అన్న విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఆ తిక్కను పోసాని తన ఇంటిలో కూడ చాలాసార్లు ప్రదర్శించడంతో తిక్క తట్టుకోలేక పోసాని భార్య కుసుమ లత తాను చనిపోతాను అంటూ ఒకసారి పోసాని ని బెదిరిస్తూ ఉత్తరం వ్రాసిందట. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఈరోజు ఒక ప్రముఖ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది. 

పోసాని తో తన పెళ్ళి అయి 29 సంవత్సరాలు నిండి 30వ వార్షికోత్సవం జరుపుకుంటున్న నేపధ్యంలో కుసుమ లత తన భర్త పోసానితో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ షాకింగ్ నిజాన్ని బయట పెట్టింది. తనకు పెళ్ళి అయిన కొత్తలో ప్రతి చిన్న విషయానికి పోసాని చికాకు పడుతూ ఉండేవాడని ఆ తిక్క తట్టుకోలేక తాను అప్పట్లో చనిపోవాలని నిర్ణయించుకుని ఆ లెటర్ వ్రాసిన విషయాన్ని తెలియచేసింది. 

వాస్తవానికి పోసాని కి కోపం వచ్చినప్పుడు గొంతు పెంచి మాట్లాడుతాడు తప్ప అతడు ఎంత మంచి వ్యక్తి అన్న విషయం తనకు తెలియడానికి చాల సంవత్సరాలు పట్టింది అన్న విషయం చెపుతూ పోసాని ని అర్ధం చేసుకోవడం కష్టం అంటూ కామెంట్ చేసింది. గతంలో తనకు అనారోగ్యం వచ్చి తన ప్రాణానికి ముప్పు అన్న విషయం తెలుసుకుని పోసాని తన కోసం అన్నం స్నానం మానివేసి 10 రోజులపాటు హాస్పటల్స్ చుట్టూ తిరిగిన తన భర్తను చూసినప్పుడు అతడిని తాను ఎందుకు అపార్ధం చేసుకున్నానా అన్న ఫీలింగ్ కలిగింది అంటూ కుసుమ లత తన అభిప్రాయాన్ని షేర్ చేసింది. 

ఒక స్త్రీని పోసాని గౌరవించినంతగా మరెవ్వరు గౌరవించరు అని అంటూ పోసాని సంపాదించినది అంతా తనకు అప్పచెపుతూ తాను ఎందుకు ఎలా ఖర్చుపెడుతున్నాను అన్న విషయం కూడ అడగడు అంటూ పోసాని పై ప్రేమను కురిపించింది. తమది భార్య భర్తల బంధం కాదు ఫ్రెండ్ షిప్ అంటూ మా ఆయన బంగారం అంటోంది కుసుమ లత..

మరింత సమాచారం తెలుసుకోండి: