ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోయిన్లలో పూజా హెగ్డే మొదటి వరుసలో ఉంటుంది. నార్త్ ఇండియా నుంచి వచ్చి టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ అయిపోయింది. తను హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ సెన్సేషన్ అల.. వైకుంఠపురంలో సినిమా భారీ బ్లాక్ బస్టర్ హిట్ సాధించి ఇండస్ట్రీ హిట్ గా రికార్డులు తిరగరాస్తోంది. అయితే.. ఎంత సెలబ్రిటీ అయినా అమెకూ కొన్ని సమస్యలు తప్పవు కదా. సామాన్యులు పడే ఇబ్బందులు సెలెబ్రిటీలకు కూడా ఎదురైతే అవి సంచలనం అవుతూ ఉంటాయి. ప్రస్తుతం తన సెల్ ఫోన్ కు నెట్ వర్క్ అందించే ప్రైవేట్ ఆపరేటర్ ఎయిర్ టెల్ ద్వారా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.
ఇదే విషయంపై ఆమె స్పందించడం ఇప్పుడు సంచలనమవుతోంది. ఎయిర్ టెల్ ఇచ్చే సర్వీస్ బాగోలేదని ఆమె ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నెట్ వర్క్ బాగలేకపోవడం, కస్టమర్ సర్వీస్ కూడా సరిగా ఇవ్వకపోవడం ఆమెకు నచ్చడం లేదట. సర్వీస్ బాగోలేకపోయినా బిల్లులు మాత్రం బాగా వాయించేస్తున్నారని అంటోంది. దీంతో ఆమెకు ఎయిర్ టెల్ నెట్ వర్క్ నుంచి వీలైనంత త్వరగా మారిపోవలని ఉందట. ఇదే విషయాన్ని తన సోషల్ మీడియా అకౌంట్ ట్విట్టర్ లో పోస్ట్ చేసి తన అసహనాన్ని ప్రకటించింది. ఈరోజుల్లో సెల్ ఫోన్ కు నెట్ వర్క్ సమస్యలు తోడైతే తీవ్ర అసహనం రావడం ఖాయం.
సామాన్యుల సమస్యలు కంపెనీ ఎగ్జిక్యూటివ్స్ కు మాత్రమే చేరతాయి.. మహా అయితే వినియోగదారుల ఫోరమ్ లో కంప్లైంట్ చేస్తే హై లైట్ అవుతాయి. అదే సెలబ్రిటీలు స్పందిస్తే నిమిషాల్లో వైరల్ అయిపోయి వార్తల్లో నిలుస్తాయి. పూజా హెగ్డే పాపులర్ నటి. బాలీవుడ్, టాలీవుడ్ ల్లో పేరొందిన నటి. మరి ఇంతటి పాపులర్ నటి ఇలా ఓ నెట్ వర్క్ పై స్పందిస్తే ఆ టాప్ కంపెనీ ఎలా రెస్పాండ్ అవుతుందో చూడాల్సిందే.
Absolutely FED up of @airtelindia and their horrible service. Wrong billing, bad customer service and their system is always having a problem. Save yourself and move to another carrier. Worst experience ever.
— pooja hegde (@hegdepooja) February 1, 2020