పవన్ కళ్యాణ్ తన ‘జనసేన’ పార్టీని బతికించుకోవడానికి తన పై ఆధార పడ్డావరి కోసం సినిమాలలో నటిస్తున్నట్లు ఇప్పటికే ఓపెన్ గా క్లారిటీ ఇచ్చాడు. ఈ విషయమై పవన్ ను టార్గెట్ చేస్తూ అనేక విమర్శలు కూడ వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో పవన్ మిషన్ 250 కోట్లు అంటూ మొదలైన ఒక సరికొత్త ప్రచారం ఇండస్ట్రీలో హాట్ న్యూస్ గా మారింది. 

ఇప్పటి వరకు పవన్ చేస్తున్నవి మూడు సినిమాలు అన్న క్లారిటీ వచ్చింది. వేణు శ్రీరామ్ క్రిష్ లు మూవీలతో పాటు హరీష్ శంకర్ మూవీకి కూడ పవన్ లైన్ క్లియర్ చేసాడు అన్న విషయాలు ఇప్పటికే అందరికీ ఓపెన్ సీక్రెట్. ఈ మూడు సినిమాలు కాకుండా పవన్ మరో రెండు సినిమాలకు కూడ ఓకె చెపుతున్నాడు అన్న వార్తలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ న్యూస్ గా మారాయి. ‘జెర్సీ’ మూవీతో ప్రశంసలు అందుకున్న గౌతమ్ తిన్నసూరి చెప్పిన స్టోరీ లైన్ కు పవన్ లైన్ క్లియర్ చేసాడు అని వస్తున్న వార్తలు మరింత షాక్ ఇస్తున్నాయి. 

దీనికితోడు విజయ్ దేవరకొండ తో సినిమాలు చేస్తున్న పూరీ జగన్నాథ్ ఈమూవీ విడుదల అయ్యాక ఒక మాస్ మూవీ పవన్ కళ్యాణ్ తో చేసే ఆస్కారం ఉంది అన్న ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈప్రాజెక్ట్ కు సంబంధించి పూరీ పవన్ ల మధ్య ప్రాధమిక చర్చలు కూడ జరిగాయి అని అంటున్నారు. గతంలో ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ సినిమాను తీసిన తరువాత పూరీకి పవన్ కు మధ్య గ్యాప్ ఏర్పడింది. 

ఇప్పుడు ఆ విషయాలను పక్కకు పెట్టి మళ్ళీ వీరిద్దరి మధ్య ప్రాధమిక చర్చలు జరిగాయి అని వస్తున్న వార్తలు అందరికీ షాక్ ఇస్తున్నాయి. ప్రస్తుతం పవన్ నటించే సినిమాలకు సంబంధించి సినిమాకు 50 కోట్లు పారితోషికం తీసుకుంటున్నట్లు టాక్. దీనితో పవన్ 2 సంవత్సరాలలో తన పార్టీ కోసం తనను నమ్ముకున్న వారికోసం 250 కోట్లు గణిస్తున్నాడా అంటూ చాలామంది షాక్ అవుతున్నారు..

 

మరింత సమాచారం తెలుసుకోండి: