తెలుగు సినిమా స్థాయిని భారతదేశానికి.. ప్రపంచ సినిమాలో భారతీయ సినిమా ప్రభంజనాన్ని సగర్వంగా చాటిన సినిమా బాహుబలి. రాజమౌళి విజన్ కు ప్రభాస్ లాంటి గ్రీకువీరుడు తోడై ఆ సినిమా సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. ఏకంగా తెలుగులో ఓ సినిమా ఇండస్ట్రీ హిట్ సాధించినా కూడా నాన్-బాహుబలి రికార్డ్ అని చెప్పుకునేంతగా చరిత్ర సృష్టించింది ఆ సినిమా. దీంతో ప్రభాస్ కు నేషనల్ స్టార్ ఇమేజ్ వస్తే.. రాజమౌళికి దేశంలోనే టాప్ 3 దర్శకుల్లో ఒకడిగా మారిపోయాడు. ఇప్పుడు వీరిద్దరి కలయికలో మరో సినిమా వస్తుందనే వార్త యావత్ భారతదేశంలో చర్చనీయాంశమైంది.

 

 

బాహుబలి తర్వాత ప్రభాస్ తో రాజమౌళి మరో సినిమా చేస్తాడని ఎప్పటినుంచో వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ సినిమా రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్టు మహాభారతమే అనుకున్నారు అందరూ. కానీ రాజమౌళి మహాభారతం ఇంట్రస్ట్ అనే అన్నాడు కానీ ఆ సినిమాపై ఇప్పటికీ ఓ క్లారిటీ లేదు. కానీ అతి త్వరలోనే రాజమౌళిప్రభాస్ కలిసి ఓ ప్రొడక్షన్ వెంచర్ ను ప్రారంభించబోతున్నట్టు ఫిలిం నగర్ లో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. ఈ ప్రొడక్షన్ వెంచర్ ద్వారా వీరిద్దరి కాంబోలోనే ఓ సినిమా తీయనున్నారట. ఈ సినిమాను మల్టీస్టారర్ గా కాకుండా ప్రభాస్ ను సోలో హీరోగానే పాన్ ఇండియా సబ్జెక్ట్ గానే తెరకెక్కించాలని జక్కన్న ఆలోచనగా చెప్తున్నారు.

 

 

ప్రస్తుతానికి ఈ సెన్షేషనల్ వార్తపై ఇంకా అఫిషియల్ క్లారిటీ లేకపోయినా ఈ వార్త మాత్రం సెన్షేషనల్ గా వైరల్ అవుతోంది. ప్రస్తుతం రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాతో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ కూడా రాధాకృష్ణ మూవీతో బిజీగా ఉండబోతున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాతే వీరి కాంబోలో సినిమా ఉంటుందని భోగట్టా. ఈ వార్తలో నిజమెంతో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: