అభిమానులు ఎప్పుడెప్పుడా అని చూసే సమయం రానే వచ్చింది. ఇక పవన్ రంగంలోకి దిగడమే ఆలస్యం, ఒక్కసారి దిగితే ఇక పనైపోయినట్లే. పవన్ కళ్యాణ్ ఇప్పుడు అదే పనిలో ఉన్నారు. సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చిన ఈ హీరో, బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్నారు. తాజాగా హరీష్ శంకర్ సినిమా ప్రకటించారు. అయితే ఇవన్నీ పవన్ ఏరికోరి చేస్తున్న సినిమాలు కావు. ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్స్. ఎన్నాళ్ళ నుంచో పవన్ వద్ద మైత్రి మూవీ మేకర్స్ అడ్వాన్స్ ఉంది. 

 

అంతవరకు బానే వుంది కానీ.. అయితే ఈ విషయమై ప‌వ‌న్‌ను విమర్శించేవారు లేకపోలేదు. ఇప్పటికే ముగ్గురు, న‌లుగురు నిర్మాత‌లు అడ్వాన్సులు ఇచ్చి వున్నారని, షూటింగ్ చేసే విధంగా కనపడటంలేదని, ఇప్పుడు గ‌తంలో అడ్వాన్స్‌లు ఇచ్చిన వాళ్ల‌కు కాకుండా కొత్త‌గా అడ్వాన్స్‌లు ఇచ్చే వాళ్ల‌కు సినిమాలు చేస్తున్నాడంటూ.. టాలీవుడ్ లో గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. 

 

ఇక మైత్రి మూవీస్ కంటే ముందే ఏ.ఎం రత్నం కు ఓ సినిమా చేయాల్సి ఉంది. నిజానికి కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే రత్నంకు ఓ సినిమా చేయాల్సి వుంది. కానీ కుదరలేదు. ఒక దశలో సినిమాను లాంచ్ చేసి మరీ ఆపేశారు. ఈ రెండు సినిమాలు పాత కమిట్మెంట్స్... వీరి దగ్గర అడ్వాన్స్ కూడా భారీ మొత్తంలో  తీసుకున్నాడు పవన్. ఇక దిల్ రాజుకు సినిమా చేస్తాను అని గతంలో మాట ఇచ్చినా... ఆయనతో కమిట్మెంట్ లేదు. అడ్వాన్స్ తీసుకోలేదు. పింక్ కథ పవన్ కు నచ్చడంతో వెంటనే అది స్టార్ట్ చేశారు. 

 

ఇలా ఇంతకుముందు ఇచ్చిన మాట ప్రకారం, తీసుకున్న అడ్వాన్సుల మేరకు మాత్రం సినిమాల్ని చేస్తున్నారు పవన్. ఇందులో భాగంగా 3 సినిమాలు ప్రకటనలు వచ్చాయి. ఇక కమిట్ మెంట్స్ లేవు. కాకపోతే తన బ్యానర్ పై చరణ్ హీరోగా ఓ సినిమా చేస్తానని గతంలో ప్రకటించారు పవన్. అదే హామీ సాయితేజ్ కు కూడా ఉంది. సో.. ఈ 3 సినిమాలు పూర్తయిన తర్వాత తన సొంత బ్యానర్ పై పవన్ సినిమాలు నిర్మిస్తాడేమో చూడాలి. ఆ పని కూడా త్వరలోనే మొదలవుతుందంటున్నారు పవన్ సన్నిహితులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: