ఈ మధ్య, టాలీవుడ్లో రోజురోజుకీ అదిరిపోయే కాంబినేషన్లు అంటూ.. సోషల్ మీడియాలో చెక్కెర్లు కొడుతున్నాయి. అవి ఎంతవరకు వాస్తవమో తెలీదు కానీ, వినడానికి సౌండ్ బావుండే ఆ వార్త ఏమంటే.. బాలయ్య నిర్మాణంలో.. క్రిష్ దర్శకత్వంలో.. శర్వానంద్ హీరో గా సినిమా రాబోతుందని, టాలీవుడ్ వర్గాలలో గుస గుసలు వినిపిస్తున్నాయి. అయితే ఇందులో నిజానిజాలు తెలియాలంటే కొన్ని రోజులు ఓపిక పట్టాల్సిందే..

 

అయితే ఇది నిజమే కావచ్చు అని పలువురు నందమూరి అభిమానులు బల్లగుద్ది చెబుతున్నారు. ఎందుకంటే.. బాలకృష్ణ అండ్ క్రిష్ ల అనుబంధం గురించి వేరే చెప్పనక్కర్లేదు. గత సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి భాగం మరియు రెండవ భాగాల ఫలితం ఎలావున్నా, ప్రేక్షకుల నుంచి భారీ రెస్పాన్స్ అందుకుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో ఎన్టీఆర్‌గా బాలయ్య బాబు నటన సూపర్బ్ అనే టాక్ వచ్చింది. మొదటి మూడు రోజులు, మంచి కలెక్షన్స్‌తో విజయవంతంగా దూసుకు పోయింది.

 

చిత్రాన్ని చూసిన పలువురు సినీ ప్రముఖులు క్రిష్ దర్శకత్వ ప్రతిభపై, బాలయ్య నటనపై ప్రశంసల వర్షం కురిపించారు. ఈ నేపథ్యంలో ఇలాంటి వార్తలను సమర్థిస్తున్నారు వారి వారి సన్నిహితులు. ఇక రెండు సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా గౌత‌మీ పుత్ర శాతక‌ర్ణి ఎలాంటి ప్రభంజనాలు సృష్టించిందో అందరికి తెలిసినదే. బాలకృష్ణ 100వ చిత్రంగా తెరకెక్కిన సినిమా ''గౌతమీ పుత్ర శాతకర్ణి''. ఈ చిత్రం అప్పట్లో  ఇండస్ట్రీలోని హాట్ టాపిక్‌గా మారింది. 

 

చారిత్రాత్మక నేపథ్యంలో 2017 వచ్చిన  అచ్చతెలుగు సినిమా ఇది. జాగర్లమూడి రాధాకృష్ణ (క్రిష్) దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నందమూరి బాలకృష్ణ, శ్రియ జంటగా నటించగా, ప్రముఖ హిందీ నటి హేమా మాలిని ప్రధాన పాత్రను పోషించారు. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వై.రాజీవ్ రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మించారు. శాతవాహన చక్రవర్తి గౌతమీపుత్ర శాతకర్ణి జీవితం ఆధారంగా రూపొందిన ఈ సినిమా, నందమూరి బాలకృష్ణ నటించిన 100వ సినిమా. జనవరి 12, 2017న విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచింది.
 

మరింత సమాచారం తెలుసుకోండి: