హాలీవుడ్ యాక్టర్ మైఖేల్ మాడిసెన్ ను ఏరికోరి అనుష్క నటిస్తున్న ‘నిశ్శబ్దం’ మూవీలో నటింప చేసారు. ఈమూవీలో అతడు నటించినందుకు అతడికి భారీ పారితోషికం ఇవ్వడం కూడ జరిగింది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుని ఏప్రియల్ 2న విడుదల కాబోతున్న ఈమూవీకి సంబంధించిన ఒక ఆసక్తికర విషయాన్ని కోన వెంకట్ ఈరోజు ఒక ప్రముఖ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక షాకింగ్ సీక్రెట్ ను బయటపెట్టాడు. 


ఈమూవీ షూటింగ్ గత సంవత్సరం జూలైలో అమెరికాలో జరుగుతున్నప్పుడు ఈమూవీలో నటిస్తున్న మైఖేల్ తమకు ఎవరికీ చెప్పకుండా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయి సుమారు వారం రోజులు పెట్టిన టార్చర్ తాను జీవితంలో మరిచిపోను అంటూ కామెంట్ చేసాడు. అనుష్కతో ఒకరోజు కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన తరువాత మైఖేల్ ఎవరికీ చెప్పకుండా వెళ్లిపోయాడని అతడి గురించి అతడి వ్యక్తిగత సహాయకులను అడిగినా తమకు తెలియదు అని చెప్పడంతో సినిమా షూటింగ్ మధ్యలో మిస్ అయిపోయిన ఈహాలీవుడ్ స్టార్ ను ఎలా పట్టుకోవాలో తెలియక ఒక ప్రైవేట్ డిటెక్టివ్ ను ఆశ్రయించిన విషయాన్ని కోన వెంకట్ గుర్తుకు చేసుకున్నాడు.


సుమారు వారం రోజులు పైగా ఇతడిని వెతికి పట్టుకోవడానికి తమ యూనిట్ ఆ ప్రవేట్ డిటెక్టివ్ యూనిట్ కు 50 లక్షలు పారితోషికం ఇవ్వవలసిన పరిస్థితులు ఏర్పడ్డాయి అంటూ కోన వెంకట్ జోక్ చేసాడు. ఈప్రవేట్ డిటెక్టివ్ ఏజన్సీ అతి కష్టం మీద మైఖేల్ ను కెనడాలోని ఒక హోటల్ లో ఉన్నట్లు గుర్తించి అక్కడకు వెళితే అక్కడ కూడ అతడు తమకు చుక్కలు చూపించిన విషయాన్ని బయటపెట్టాడు. 


తాము అతడు హోటల్ లో ఉండే రూమ్ దగ్గరకు వెళ్లి హోటల్ సిబ్బంది సహాయంతో తలుపు తీయమని అడిగినా మూడు రోజులు తలుపు తీయకుండా అతడు టార్చర్ పెట్టడంతో చివరకు అతడి పై పోలీసు కంప్లైంట్ ఇస్తాము అంటూ బెదిరించడంతో చివరకు మైఖేల్ హోటల్ తన రూమ్ తలుపులు తెరిచి అసలు విషయం బయటపెట్టిన విషయాన్ని వివరించాడు. తాను ఈమూవీ షూటింగ్ సమయంలో అనుకోకుండా హర్ట్ అయ్యాను అంటూ మైఖేల్ చెప్పడంతో అతడిని చాల కష్టపడి ఒప్పించి తిరిగి షూటింగ్ స్పాట్ కు తీసుకు వచ్చి అనుష్క తో నటింప చేయవలసి వచ్చిన విషయాన్ని కోన వెంకట్ వివరించినా అసలు అనుష్క వలన మైఖేల్ సమస్య ఏర్పడిందా లేదంటే మైఖేల్ తో అనుష్కకు సమస్య వచ్చిందా అన్నవిషయం మాత్రం క్లారిటీ లేదు..   

మరింత సమాచారం తెలుసుకోండి: