తెలుగు ఇండస్ట్రీలో ‘చిత్రం’ లాంటి యూత్ ఫుల్ మూవీతో డైరెక్టర్ గా పరిచయం అయ్యాడు తేజ.  ఆ తర్వాత నితిన్, సదా హీరో హీరోయిన్ గా ‘జయం’ లాంటి ప్రేమ కథా చిత్రంతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.  ఓ పేద యువకుడు పెద్దింటి అమ్మాయిని ప్రేమించి ఆమె కోసం ఎంత ధైర్యం చేశాడు అన్న కాన్సెప్ట్ తో ఈ చిత్రం అప్పట్లో ఓ ట్రెండ్ సృష్టించింది.  ఆ తర్వాత తేజ కొన్ని చిత్రాలు తీసిన పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  దాంతో కొంత కాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆ మద్య దగ్గుబాటి రానా, కాజల్ హీరో హీయిన్లుగా ‘నేనే రాజు నేనే మంత్రి’ చిత్రంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చారు.  ఈ మూవీ సూపర్ హిట్ అయ్యింది.  దాంతో ఇక డైరెక్టర్ గా తేజ లైన్లోకి వచ్చారని అందరూ భావించారు.

 

ఇదే సమయంలో బాలకృష్ణ హీరోగా ఎన్టీఆర్ బయోపిక్ మూవీ తేజ తెరకెక్కిస్తున్నారని అప్పట్లో వార్తలు వచ్చాయి. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం ఆ ప్లేస్ లో క్రిష్ రావడం జరిగింది.  ఇక గత ఏడాది బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ జంటగా తీసిన సీత చిత్రం కూడా ఫ్లాప్ అయ్యింది.  దాంతో తన తదుపరి చిత్రాల విషయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు తేజ.

 

తేజ మరోసారి రానాతోనే ఓ చిత్రం చేయడానికి  సిద్ధమవుతున్నాడు. ఈ చిత్రానికి  'రాక్షస రాజు రావణుడు' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే  గోపీచంద్ హీరోగా మరో చిత్రం చేయడానికి కూడా ఆయన రంగాన్ని సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రానికి  'అలివేలు వెంకటరమణ' అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ఈ రెండు  చిత్రాలను సమాంతరంగా చేయడానికి తేజ చకచకా పనులను చేయిస్తున్నాడు.  గతంలో జయం చిత్రంలో గోపిచంద్ ని విలన్ గా చూపించారు తేజ. మరి ఈసారి హీరోగా ఏ రేంజ్ లో చూపిస్తారో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: