తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో అల్లు అర్జున్.  మొదటి చిత్రం గంగోత్రిలో లో పెద్దగా పర్ఫామెన్స్ చూపించకున్నా.. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ‘దేశముదురు’ చిత్రంలో నిజంగానే దేశముదురుగా నటించాడు.  డ్యాన్స్, ఫైట్స్, కామెడీ అన్ని విషయాల్లో దుమ్మురేపిన అల్లు అర్జున్ తర్వాత బన్ని, ఆర్య లాంటి చిత్రాలతో తన రేంజ్ ఏంటో చూపించాడు.  అప్పటి నుంచి ఫ్యాన్స్ బన్నిని స్టైలిష్ స్టార్ గా పిలుచుకోవడం మొదలు పెట్టారు. అల్లు అర్జున్ ఏ చిత్రంలో అయినా తన డ్యాన్స్ లో కొత్త ప్రయోగాలు చూపించడం గమనిస్తూనే ఉన్నాం.  ఇక సరైనోడు లాంటి బిగ్గెస్ట్ హిట్ తర్వాత నాపేరు సూర్య లాంటి భారీ డిజాస్టర్ చవిచూశాడు. రెండేళ్లు గ్యాప్ తీసుకున్న అల్లు అర్జున్ ఈ ఏడాది త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అల వైకుంఠపురములో’ చిత్రంతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

 

ఈ చిత్రం సూపర్ డూపర్ హిట్ అందుకుంది.  అయితే ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త టెన్షన్ లో ఉన్నట్లు టాలీవుడ్ లో గుస గుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్, శాండిల్ వుడ్ ఇలా అన్ని సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు పాన్ ఇండియా చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెడుతున్నారు.  ఇప్పటికే ప్రభాస్ లాంటి హీరో బాహుబలి సీరీస్, సాహెూ లాంటి చిత్రాలతో జాతీయ స్థాయిలో తన రేంజ్ ఏంటో చూపించాడు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ తో మొదలు పెట్టారు. ఇప్పుడు ఆర్ఆర్ఆర్ మూవీతో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు సైతం లైన్లో ఉన్నారు. అంతే కాదు త్వరలో మహేష్ సైతం కెరీర్ 27వ చిత్రంతో తనని తాను పాన్ ఇండియా స్థాయిలో ఆవిష్కరించుకునే ప్రయత్నంలో ఉన్నాడు. 

 

తమిళ స్టార్ హీరో ధనుష్ సైతం హిందీలో పెద్ద స్టార్ గా ఎదిగాడు.  ప్రస్తుతం యంగ్ హీరో విజయ్ దేవరకొండ కూడా ఇదే బాట నడుస్తున్నాడు.  ఇప్పటికే కేజీఎఫ్ తో కన్నడ హీరో యష్ తన సత్తా చాటాడు. ఇంత మంది హీరోలు పాన్ ఇండియా మూవీస్ పై కన్నేస్తే.. అల్లు అర్జున్ తాను ఏమీ తక్కువ తినలేదని నిరూపించుకునేందుకు రంగం సిద్దం చేసుకుంటున్నట్లు సమాచారం. ఇక బన్ని నటిస్తున్న ఏఏ 20 తర్వాత మురుగదాస్ తో ఏఏ 21 పాన్ ఇండియా కేటగిరీలో రిలీజ్ చేయనున్నారన్న ఆలోచనలో ఉన్నట్లు టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: