దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి డైరెక్షన్ లో బిగెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం 'ఆర్ఆర్ఆర్'.  టాలీవుడ్ స్టార్ హీరోలు ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు మొదటి సారి కలిసి నటిస్తున్న ఈ చిత్రం పై దేశ వ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ను జరుపుకుంటుంది.  ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయాన్ని వస్తే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే  థియేట్రికల్ బిజినెస్ క్లోజ్ అయ్యింది. ఈడీల్ విలువ 200కోట్లని టాక్ అలాగే కర్ణాటక లో ఆర్ఆర్ఆర్ ప్రీ రిలీజ్ బిజినెస్ 40కోట్లను టచ్ చేసి రికార్డు సృష్టించింది. 
 
ఇక ఓవర్సీస్ విషయానికి వస్తే  ఒక్క యూఎస్ఏ లో నే ఈచిత్రం 41కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి ఆల్ టైం రికార్డు సృష్టించింది. ఇప్పటివరకు వేరే ఏ ఇండియన్ మూవీ కూడా అక్కడ ఈరేంజ్ లో బిజినెస్ చేయలేదు. పీరియాడికల్ బ్యాక్ డ్రాప్ లో స్వాతంత్య్ర సమర యోధులు అల్లూరి సీతారామరాజు, కొమరం భీం జీవిత చరిత్రల ఆధారంగా రూపొందుతున్న ఈచిత్రంలో  బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్, తమిళ నటుడు సముద్ర ఖని ముఖ్యపాత్రల్లో నటిస్తుండగా ఎన్టీఆర్ కు జోడిగా హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ ,చరణ్ కు జోడిగా బాలీవుడ్ హీరోయిన్ ఆలియా బట్ కనిపించనున్నారు.
 
 
భారీ విజువల్ ఎఫెక్ట్స్ తో రానున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమరం భీం గా ,రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా నటిస్తున్నారు. సుమారు 300 కోట్ల భారీ బడ్జెట్ తో దానయ్య డివివి నిర్మిస్తున్న ఈ చిత్రానికి  కీరవాణి సంగీతం అందిస్తుండగా సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నాడు. వచ్చే  ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న దక్షిణాది భాషలతో పాటు హిందీ లో ఈ సినిమా విడుదలకానుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: