ఇప్పుడు ఈ ప్రశ్నకు అవును అనే సమాధానమే వినపడుతుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో హీరోయిన్లు ఎక్కువగా లేరని ఎటు చూసినా సరే ఇద్దరు ముగ్గురు మాత్రమే కనపడుతున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో ఒకప్పుడు సినిమాలు చెయ్యడానికి చాలా మంది హీరోయిన్లు ఆసక్తి చూపించే వారు. అయితే ఇప్పుడు వారిలో ఎవరూ స్టార్ హీరోయిన్లు గాని ప్రస్తుతం ఉన్న స్టార్ హీరోల రేంజ్ కి సరిపడే హీరోయిన్లు గాని లేరు అని అంటున్నారు. అందుకే ముగ్గురు హీరోయిన్లతో సినిమాలను నెట్టుకువస్తున్నారు దర్శకులు. 

 

సమంతా, పూజా హెగ్డే, రష్మికా మంధనా... ఈ ముగ్గురు మినహా ఎవరూ కనపడటం లేదని అంటున్నారు సినీ పరిశీలకులు. ఇటీవలి కాలంలో వస్తున్న సినిమాలు అన్నీ కూడా వీరి ఇద్దరి చుట్టూనే తిరుగుతున్నాయని అంటున్నారు. మహేష్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇలా ఎవరితో చూసినా సరే ఈ ఇద్దరే మినహా ఏ హీరోయిన్ కనపడటం లేదని అంటున్నారు. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం బాలీవుడ్, హాలీవుడ్ హీరోయిన్లను తీసుకున్నారు. 

 

అదే విధంగా మహేష్ తో తర్వాతి సినిమా కోసం వంశీ పైడపల్లి పూజ హెగ్డే తో మాట్లాడినట్టు సమాచారం. ఇకపోతే త్రివిక్రమ్, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం రష్మిక మంధనా ను సంప్రదించారని వార్తలు వస్తున్నాయి. లేకపోతే బాలీవుడ్ హీరోయిన్ల కోసం చూస్తున్నారు. ప్రయోగాల కోసం కూడా ట్రై చేయడం లేదు దర్శకులు. దీనితో టాలీవుడ్ కి హీరోయిన్ల కొరత ఎక్కువగా ఉందని, తెలుగు అమ్మాయిలు ఉన్నా సరే వాడుకునే ప్రయత్నం చేయకుండా ఇతర భాషల మీద ఆధారపడటమే ఈ కొరతకు కారణమని సిని ప్రియులు అంటున్నారు. ఇంత పెద్ద సినిమా పరిశ్రమలో స్టార్ హీరోలతో సినిమాలు చెయ్యడానికి హీరోయిన్లు దొరకకపోవడం ఏంటీ అంటున్నారు పలువురు.

మరింత సమాచారం తెలుసుకోండి: