మెగాస్టార్ చిరంజీవి హీరోగా తెరకెక్కిన భారీ చారిత్రక చిత్రం సైరా నరసింహా రెడ్డి. రేనాటి గడ్డ మీద బ్రిటీష్ పాలకులను ఎదిరించిన తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో ఈ సినిమాను తెరకెక్కించారు. దాదాపు 12 చిరు కలను నేరవేర్చేందుకు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకుడు సురేందర్ రెడ్డిలు ఎంతో శ్రమించారు. దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ ప్రాజెక్ట్ కోసం ఏకంగా మూడేళ్ల పాటు శ్రమించాడు. అయితే ఈ సినిమాకు హిట్ టాక్ వచ్చినా రికార్డ్ లు తిరగ రాసే స్థాయిలో మాత్రం సక్సెస్ కాలేదు.
ఇంత భారీ చిత్రం దర్శకుడు సురేందర్ రెడ్డి లాంగ్ బ్రేక్ తీసుకున్నాడు. ధృవ సినిమా తరువాత కూడా లాంగ్ బ్రేక్ తీసుకున్న సురేందర్ రెడ్డి, సైర తరువాత ఇంత వరకు సినిమాను ప్రకటించలేదు. సినిమా పూర్తయిన వెంటనే కొంత కాలం విదేశాలకు వెళ్లిపోయిన సూరి తరువాత తదుపరి చిత్రానికి కథ రెడీ చేసే పనిలో ఉన్నాడు. అయితే తాజాగా సురేందర్ రెడ్డి నెక్ట్స్ ప్రాజెక్ట్పై ఆసక్తికర వార్త ఒకటి టాలీవుడ్ సర్కిల్స్లో వినిపిస్తోంది. ఈ దర్శకుడిగా కెరీర్లో బిగ్గెస్ట్ హిట్స్లో ఒకటైన రేసుగుర్రం సినిమాకు సీక్వెల్ను రెడీ చేసే పనిలో ఉన్నాడట.
రేసుగుర్రం సినిమాకు వక్కంతం వంశీ కథ అందించాడు. అయితే తరువాత వంశీ బన్నీ హీరోగా నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాను రూపొందించి ఫెయిల్ అయ్యాడు. దీంతో కొంత కాలంగా సైలెంట్గా ఉన్న వంశీ రేసుగుర్రం సీక్వెల్తో తిరిగి ఫాంలోకి రావాలని చూస్తున్నాడట. అందుకే సురేందర్ రెడ్డితో కలిసి కొత్త ప్రాజెక్ట్ మీద సీరియస్గా పని చేస్తున్నాడు. ప్రస్తుతానికి ప్రాజెక్ట్ ఎనౌన్స్ కాకపోయినా సురేందర్ రెడ్డి నెక్ట్స్ రేసుగుర్రం 2 సినిమాతోనే ప్రేక్షకుల ముందుకు రావటం ఖాయమన్న టాక్ వినిపిస్తోంది.