తెలుగు ఇండస్ట్రీలో అంకుశం, ఆహుతి, మగాడు లాంటి చిత్రాల్లో పవర్ ఫుల్ పాత్రల్లో కనిపించి డాక్టర్ రాజశేఖర్ యాక్షన్ చిత్రాలకు గుడ్ బాయ్ చెప్పిన ఫ్యామిలీ తరహా చిత్రాల్లో నటించడం మొదలు పెట్టారు.  ఆ తరహా చిత్రాలు పెద్దగా హిట్ టాక్ తెచ్చుకోలేక పోయాయి. దాంతో రాజశేఖర్ ఇండస్ట్రీకి కొంత కాలం దూరంగా ఉంటూ వచ్చారు.  ఆ సమయంలో ఆయన ప్రస్థానం పూర్తిగా ముగిసిందని.. లేదు రాజశేఖర్ విలన్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తారని రక రకాల వార్తలు వచ్చాయి.  అయితే అందరికీ ట్విస్ట్ ఇస్తూ గరుడ వేగ చిత్రంతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు.  తనకు అచ్చొచ్చిన పోలీస్ పాత్రలో దుమ్మురేపాడు.  ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. 

 

ఆ తర్వాత కల్కి చిత్రంతో మరో విజయం తన ఖాతాలో వేసుకున్నాడు రాజశేఖర్.  ఆ మద్య మా అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ సందర్భంగా ఆయన చేసిన రచ్చ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో టాలీవుడ్ లో రాజశేఖర్ కి చిత్రాల్లో నటించే అవకాశాలు ఉంటాయా ఉండవా అన్న అనుమానాలు కూాడా వచ్చాయి.  వాటన్నింటికి చెక్ పెడుతూ రాజశేఖర్ కొత్త చిత్రంలో నటించబోతున్నారు.  'అహ నా పెళ్ళంట', 'పూలరంగడు' చిత్రాలకు దర్శకత్వం వహించిన వీరభద్రం చౌదరితో నటిస్తున్నారు. వాస్తవానికి ఓ కన్నడ రీమేక్ లో నటించాలని, దానికి 'సత్య', 'బేతాళుడు' సినిమాల దర్శకుడు ప్రదీప్ కృష్ణమూర్తిని తీసుకోవాలని అనుకున్నారట. 

 

అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని..  ఆ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కకపోవడంతో వీరభద్రం చౌదరికి లైన్ క్లియర్ అయింది. ఈ చిత్రంలో రాజశేఖర్ సరసన ప్రముఖ నటి శ్రియ నటిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఇటీవల ఆమెను సంప్రదించగా..  ఓకే చెప్పిందట. కాగా, ఈ వెటరన్ బ్యూటీ, బాలకృష్ణ హీరోగా బోయపాటి దర్శకత్వం వహిస్తున్న చిత్రంలోనూ నటించే చాన్స్ కొట్టేసిందన్న సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: