సిని పరిశ్రమలో ఉన్న వాళ్ళ గురించి ఏదైనా వార్త వస్తే చాలు దానికి మీడియా ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు అనే సంగతి అందరికి తెలిసిందే. చిన్న వార్త బయటకు వచ్చినా సరే మీడియా దానికి అనవసరంగా ప్రాధాన్యత ఇవ్వడమే కాకుండా లేనిపోని ప్రచారాలు అన్నీ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని ప్రేమ కథల విషయంలో మీడియా ఇదే విధంగా అతి చేయడం ఇప్పుడు ఆశ్చర్యంగా మారింది. ముఖ్యంగా సీనియర్ హీరోయిన్ అనుష్క విషయంలో ఇప్పుడు ఒక రూమర్ బాగా హైలెట్ అవుతుంది. 

 

ఆమె ఎవరో క్రికెటర్ ని పెళ్లి చేసుకుంటున్నారు, ఆ విషయం ఇంట్లో వాళ్లకు కూడా తెలుసు, దానికి అందరి ఆమోదం లభించింది అంటూ వార్తలు వచ్చాయి. అది అసలు నిజం కాదని అంటున్నారు టాలీవుడ్ జనాలు. ఆ వార్త చావక ముందే ఇప్పుడు ఒక వార్త బయటకు వచ్చింది. ఆమె ఇటీవల ముంబై విమానాశ్రయానికి ఒక కార్ కూడా పంపినట్టు సమాచారం. సదరు క్రికెట్ విదేశాల నుంచి రావడంతో ఆమె కార్ పంపిందట. ఇది ఎంత వరకు నిజమో తెలియదు గాని దీని గురించి మాత్రం ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కువ చర్చలు జరుగుతున్నాయి. 

 

ఇటీవల ముంబై కూడా అతని కోసం ఆమె వెళ్లినట్టు తెలుస్తుంది. సదరు క్రికెటర్ తో కలిసి ఆమె షాపింగ్ కూడా సైలెంట్ గా చేసినట్టు సమాచారం. దీనిపై సోషల్ మీడియాలో ఇప్పుడు ఎక్కువగానే చర్చలు జరుగుతున్నాయి. కాస్త వార్త వస్తే దాన్ని అన్ని విధాలుగా వండి వార్చే మీడియా... ఈ విషయంలో కూడా అదే విధంగా ప్రవర్తిస్తుంది. ఆమె ఎప్పుడు వెళ్లిందో తెలియకపోయినా కొందరు మాత్రం అప్పుడు వెళ్ళింది ఇప్పుడు వెళ్ళింది అంటూ తోచిన రాతలు రాస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. కాగా ప్రస్తుతం అనుష్క చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: