ద్వితీయ విఘ్నం అనేది చాలా మంది దర్శకులను వేధించే సమస్య. హీరోలకు కూడా ఆ సమస్య ఎక్కువగానే ఉంటుంది. దీనితో చాలా మంది రెండో సినిమా విషయంలో చాలా మంది జాగ్రత్తలు తీసుకుంటున్నారు. తాజాగా ఈ జాగ్రత్తలే తీసుకుని హిట్ కొట్టాడు నితిన్ దర్శకుడు వెంకి కుడుముల. తాజాగా అతను చేసిన భీష్మ సినిమా మంచి హిట్ ఇచ్చింది. ఈ సినిమా ఇప్పటి వరకు 8 కోట్ల వరకు షేర్ సాధించింది. ప్రస్తుతం ఉన్న ఊపు చూస్తే ఈ సినిమా భారీ విజయం సాధించే విధంగా కనపడుతుంది. 

 

ఇదిలా ఉంటే ఈ సినిమా ద్వారా వెంకి కుడుముల మాత్రం ద్వితీయ విఘ్నం నుంచి బయటకు వచ్చాడు. రాజమౌళి, త్రివిక్రమ్, బోయపాటి, కొరటాల శివ లాంటి దర్శకులు ఈ విఘ్నం దాటేసారు. చాలా మంది దర్శకులే ఈ జాబితాలో ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి. స్టూడెంట్ నెంబర్ వన్ సినిమా తర్వాత సింహాద్రి సినిమాను చేసాడు. ఈ సినిమా టాలీవుడ్ ని షేక్ చేసింది. ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకుడిగా రెండో సినిమాతో మంచి హిట్ ఇచ్చాడు మహేష్ బాబుకి. నువ్వే నువ్వే సినిమాతో దర్శకుడిగా మారిన ఈయన.. 

 

అతడు సినిమాతో మహేష్ బాబుకు హిట్ ఇచ్చి విఘ్నం దాటాడు. బోయపాటి శ్రీను కూడా రవితేజతో తొలి సినిమా భద్ర చేసిన తర్వాత రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని వెంకటేష్ హీరోగా తులసి చేసి సూపర్ హిట్ కొట్టాడు. ఇక కొరటాల శివ విషయానికి వస్తే ప్రభాస్ మిర్చి తర్వాత మహేష్ బాబుతో శ్రీమంతుడు చేసి బిగ్గెస్ట్ హిట్ కొట్టేసాడు. ఈ విధంగా టాలీవుడ్ లో ద్వితీయ విఘ్నం దాటిన దర్శకుల్లో వెంకి కుడుముల నిలిచాడు. దీనితో అగ్ర దర్శకుల జాబితాలో చేరిపోయాడు ఈ దర్శకుడు. కాగా ఈ సినిమా లో రష్మిక మంధన హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: