తెలుగు ఇండస్ట్రీలో స్టార్ వారసులు హీరోలుగా వస్తున్న సమయంలో రెబల్ స్టార్ కృష్ణం రాజు హీరోగా ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించాడు. ఆయన సోదరుడు తనయుడు ప్రభాస్ ‘ఈశ్వర్’ చిత్రంతో హీరోగా తెలుగు తెరకు పరచయం అయ్యాడు. మొదటి చిత్రం మాస్ పాత్రలో దుమ్ముదుళిపాడు. అచ్చం పెదనాన్న డైలాగ్స్ లాగే అనిపించాయి.. హైట్ పర్సనాలిటీ చూసి ఇండస్ట్రీకి మంచి హీరో వచ్చాడని కితాబు ఇచ్చారు. ఆ తర్వాత ప్రభాస్ నటించిన చిత్రాలు పెద్దగా సక్సెస్ కాలేదు. రాజమౌళి తీసిన చత్రపతి ప్రభాస్ అదృష్టాన్ని పూర్తిగా మార్చేసింది.. వరుస విజయాలకు పునాధి వేసింది. మిర్చి, డార్లింగ్ తో మంచి విజయాలు అందుకున్న ప్రభాస్ మరోసారి రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి, బాహుబలి 2 సినిమాలతో ఏకంగా జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు.
ఈ సినిమాలతో ప్రభాస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది.. ఆయన నటించే ప్రతి చిత్రాలపై భారీ అంచనాలు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో గత ఏడాది సుజిత్ దర్శకత్వంలో వచ్చిన ‘సాహెూ’ బారీ డిజాస్టర్ అయ్యింది. దాంతో ప్రభాస్ అన్ని విషయాల్లో జాగ్రత్తగా ఉండాలనే ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం krishna KUMAR' target='_blank' title='రాధా కృష్ణ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>రాధా కృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాడు. అతి తక్కువ విజువల్ ఎఫెక్స్ సీన్స్ ఉండాలని దర్శకుడు రాధాకృష్ణ కి షూట్ ప్రారంభంలోనే ప్రభాస్ చెప్పాడట. దాంతో కాస్త ఎక్కువ సమయం తీసుకుని నాచురల్ గా సినిమా తీస్తున్నట్లుగా చిత్ర యూనిట్ తెలిపింది.
ఈమద్య కాలంలో ప్రతిదానికి గ్రాఫిక్స్ వాడుతున్నారు. గతంలో తాను నటించిన చిత్రాలు ఎక్కువ గ్రాఫిక్స్ మాయాజాలం ఉండటంతో ఆడియన్స్ బోర్ ఫీల్ అయినట్లు.. ఇక నుంచి తాను ఎక్కువగా నేచురల్ గా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటానని అంటున్నాడట ప్రభాస్. ఈ ఏడాది చివరి వరకు అయినా ఈ చిత్రం విడుదల చేసేలా ప్రయత్నాలు చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా ఈ చిత్రం విడుదల చేసేలా సన్నాహాలు చేస్తున్నారు.